Supreme Court: బీహార్ SIRపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- బీహార్ SIRపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఇక కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ యాత్ర చేపట్టారు. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించడంపై ఇండియా కూటమి పోరాటం చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: అసెంబ్లీలో డీకే.శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాలాపన.. బీజేపీ నేతలు చిరునవ్వులు.. దేనికి సంకేతం
Also Read
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Karnataka: డీకే.శివకుమార్కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఓటర్లు సమర్పించే 11 పత్రాల్లో ఆధార్ను కూడా చేర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగించబడిన ఓటర్ల పేర్లను సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక బూత్-లెవల్ ఏజెంట్లకు స్థానికుల గురించి అవగాహన ఉంటుందని అభిప్రాయపడింది. వలసదారుడు ఎవరో.. స్థానికుడెవరో వారికి బాగా తెలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
గురువారం బీహార్ ఓటర్ల జాబితాల సవరణపై నివేదికను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ప్రత్యేక సర్వే తర్వాత 65 లక్షల ఓట్లను తొలగించినట్లు తెలిపింది. అయితే ఈ డేటాను ఆన్లైన్లో పొందిపరచాలని సూచించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి బెంచ్ ఆగస్టు 19 వరకు గడువు విధించింది. ఇక పౌరులు తమ ఆధార్ కార్డు కాపీ దరఖాస్తులో పెట్టొచ్చని స్పష్టంగా ఈసీ తెలియజేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లో రాష్ట్ర స్థాయి జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది.
అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్లో తుది ఓటర్ జాబితా విడుదల చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం ఈసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!