Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళన.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covishield: బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తం రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయని ఇటీవల అంగీకరించింది. ఈ విషయం వ్యాక్సిన్ తీసుకున్న జనాల్లో భయాందోళనల్ని రేకెత్తించింది. దీనిని ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి ‘‘కోవిషీల్డ్’’ వ్యాక్సిన్ పేరుతో ప్రజలకు అందించింది. అయితే, కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలపై దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించేందుకు అంగీకరించింది. విచారణ తేదీని నిర్ణయించలేదు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ సమస్యను అంగీకరించారు, పిటిషన్లో దుష్ప్రభావాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందం మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ పిటిషన్పై ముందస్తు విచారణను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Read Also: Kottu Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం.. గందరగోళం సృష్టించాలని ప్లాన్..!
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
పిటిషనర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, ఇతర సంభావ్య ప్రమాదాలను పరిశీలించేందుకు నిపుణులతో ప్యానెల్ ఏర్పాటు చేయాలని, ఈ దర్యాప్తును రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు వికలాంగులుగా మారారని, వారికి నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇటీవల తమ టీకాతో అరుదైన సందర్బాల్లో TTS లేదా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్కి కారణమవుతుందని, దీని వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కి దారితీస్తుందని ఆస్ట్రాజెనికా అంగీకరించింది. యూకేలో న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 2021లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో ఓ వ్యక్తి మెదడులో గాయం ఏర్పడింది. దీనిపై న్యాయపోరాటం ప్రారంభమైంది. ముందుగా తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని ఆస్ట్రాజెనికా చెప్పినప్పటికీ, ఇటీవల కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇండియాలో కూడా కొందరు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చనిపోయిన వారి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ని విచారించేందుకు అంగీకరించింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!