Twin Towers Demolition: 9 సెకన్లలో ముగిసిన తొమ్మిదేళ్ల సుదీర్ఘ యుద్ధం.. కూల్చేశారు కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twin Towers Demolition: నోయిడాలోలోని సెక్టార్ 93ఏలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్ను ఆదివారం అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ట్విన్ టవర్స్ను 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి దాదాపు తొమ్మిది సెకన్ల వ్యవధిలో కూల్చివేశారు. తద్వారా తొమ్మిదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలికింది. సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత ఆ ప్రాంతమంతా ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాటర్ఫాల్ టెక్నిక్ను ఉపయోగించి బటన్ నొక్కి జంట భవనాలను నేలమట్టం చేశారు. అపెక్స్ (32 అంతస్తులు), సెయానే (29 అంతస్తులు) టవర్ల కూల్చివేత వల్ల దాదాపు 35,000 క్యూబిక్ మీటర్ల శిధిలాలు మిగిలిపోయాయి, వీటిని క్లియర్ చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.
సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేసిన వెంటనే, నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి ఆదివారం మాట్లాడుతూ.. “సమీపంలోని సొసైటీకి చెందిన 10 మీటర్ల సరిహద్దు గోడ, ఏటీఎస్ శిథిలాల వల్ల దెబ్బతింది. ఇప్పుడు కూల్చివేసిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ పరిసరాల్లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కూల్చివేత విజయవంతంగా జరిగిందని, సమీపంలోని ఖాళీ సొసైటీల నివాసితులు సాయంత్రం 7 గంటలకు వారి ఇళ్లకు తిరిగి అనుమతించబడ్డారు. సుమారు 100 వాటర్ ట్యాంకర్లు, 300 మంది శుభ్రపరిచే సిబ్బందిని ఇక్కడ నియమించారు” అని ఆమె చెప్పారు.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
కూల్చివేత 100 శాతం విజయవంతమైందని, మొత్తం భవనాన్ని కూల్చివేయడానికి 9-10 సెకన్లు పట్టిందని ఎడిఫైస్ అధికారి చేతన్ దత్తా తెలిపారు. “నేను భవనం నుండి కేవలం 70 మీటర్ల దూరంలో ఉన్నాను. కూల్చివేత 100 శాతం విజయవంతమైంది. మొత్తం భవనం కూల్చివేయడానికి 9-10 సెకన్లు పట్టింది. నా బృందంలో 10 మంది వ్యక్తులు, 7 మంది విదేశీ నిపుణులు, ఎడిఫైస్ నుండి 20-25 మంది ఉన్నారు. ఇంజినీరింగ్” అని దత్తా అన్నారు ఎడిఫైస్ బృందం స్థలానికి వెళ్లి అవశేషాలు, మిగిలిపోయిన పేలుడు పదార్థాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని పరిశీలించిందని నోయిడా పోలీస్ కమీషనర్ వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, సెక్టార్ 93ఏ సమీపంలోని ఆసుపత్రులు అవసరమైతే అత్యవసర వైద్య సేవలను అందించడానికి సన్నాహాలు చేశాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, ఎయిర్ ప్యూరిఫైయర్లను ఆన్ చేసి, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎన్-95 మాస్క్లు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ ట్విన్ టవర్స్ దేశ రాజధానిలోని కుతుబ్ మినార్ కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించిన సంగతి తెలిసిందే.
ఒక బటన్ను నొక్కినప్పుడు పేలుడు సంభవించిన వెంటనే, టవర్లు కూలిపోయి, భారీ ధూళిని సృష్టించి, దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసింది. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ విభాగం కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి కూల్చివేత ప్రదేశంలో ఆరు ప్రత్యేక డస్ట్ మిషన్లను ఏర్పాటు చేసింది. కూల్చివేత ప్రదేశానికి సమీపంలోని ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుమ్మును దింపేందుకు యాంటీ స్మోగ్ గన్లు గాలిలో నీటి బిందువులను కూడా స్ప్రే చేశాయి.
Akasa Air : ఆకాశ ఎయిర్లైన్స్పై హ్యాకర్ల దాడి
ఆదివారం నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్లు పేలడంతో, బీజేపీరాష్ట్రంలోని అప్పటి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర దాడిని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ‘టవర్’కు ఆమోదం తెలిపినందుకు సమాజ్వాదీ పార్టీ, అధికారులపై మండిపడ్డారు. “అఖిలేష్ యాదవ్, ఆ సమయంలోని ప్రతి అధికారి ఇటువంటి అక్రమ నిర్మాణాలపై సమాధానం చెప్పాలి. ఈ అక్రమ నిర్మాణాలన్నీ అప్పటి ప్రభుత్వ రక్షణలో ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని ఆయన ఆరోపించారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలన్నింటిపై సీఎం యోగి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆగస్టు 21న టవర్ల కూల్చివేతకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది, అయితే నోయిడా అథారిటీ అభ్యర్థన మేరకు ఆగస్టు 28 వరకు పొడిగించింది.
ఫ్లాట్లో నిద్రపోయిన వ్యక్తి: ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే కూల్చివేత ప్రక్రియకు ముందుగానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ఇ అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుండిపోయాడు. ట్విన్ టవర్స్కు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోని టాప్ ఫ్లోర్లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్లోని పై అంతస్తు ఫ్లాట్లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు.వెంటనే టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్కు పంపారు.కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్ఫోర్స్ సభ్యుడు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన వ్యాఖ్యలు: నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. అవినీతి శిఖరం కూలిందని కొందరు, ఇస్రో గగన్యాన్కు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని మీడియా ఈ అంశానికి ఇచ్చిందని మరికొందరు ట్వీట్లు చేశారు. బహుళ అంతస్తుల భవంతులను ఎలా కూల్చివేస్తారో చూసేందుకు అనేకమంది తమ టీవీలకు అతుక్కుపోయారు. 32, 29 అంతస్తులు చొప్పున ఉన్న అపార్ట్మెంట్లను కూల్చడం నిజంగా అవసరమా, వాటిని ప్రజావసరాలకైనా వినియోగించుకుంటే బాగుండేది కదా అనే సూచనలూ పలువురి నుంచి వచ్చాయి. కూల్చివేతను ప్రసార మాధ్యమాల సిబ్బందితోపాటు అనేకమంది తమ కెమెరాల్లో, మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వారిలో కొందరు తమ బాల్కనీల నుంచి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అక్రమ నిర్మాణాలు చేసేవారికి తగిన శాస్తి జరిగిందంటూ కొందరు ఆ కోణానికి సంబంధించిన సినీ డైలాగులనూ జత చేశారు. ప్రత్యక్షంగా తిలకించడానికి ఆసక్తి చూపినవారు సురక్షిత దూరంలో నిల్చొన్నారు.
Twin Towers, symbol of corruption and greed are now history!pic.twitter.com/8KxiOgI5YX
— The Uttar Pradesh Index (@theupindex) August 28, 2022
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!