Ajit Pawar Mysterious Death: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మరియు కుటుంబం ఈ విషయంలో పారదర్శకత కోరుతున్నట్లు తత్కరే తెలిపారు. ఏదైనా కుట్ర జరిగిందని నిరూపించేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు వెంటనే ఆమోదించాల్సిన అవసరాన్ని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ రాష్ట్ర రాజకీయ వర్గాలలో గాఢ చర్చకు దారితీసింది. ఎన్సిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెజెంటేషన్లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ప్రఫుల్ పటేల్, ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే, వైద్య, విద్యా మంత్రులు హసన్ ముష్రిఫ్, యువ నాయకుడు పార్థ్ పవార్ పాల్గొన్నారు. అంతేకాక, ఎన్సిపి ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా గత నెలలో తన మామ అజిత్ పవార్ మరణం సాధారణ ప్రమాదమా లేదా? కుట్రా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
జనవరి 28న బారామతి విమానాశ్రయంలో లియర్ జెట్ విమానం కూలిపోవడం వలన ఏర్పడిన ప్రమాదం మహారాష్ట్రలో మరియు దేశవ్యాప్తంగా విమాన భద్రతపై కొత్త ప్రశ్నలు ఉత్పన్నం చేసిందన్నారు రోహిత్ పవార్..ఈ ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అన్ని సాంకేతిక రికార్డులు, CCTV ఫుటేజ్లు అవసరమని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండకూడదు అంటున్నారు.. ఈ సంఘటన మరణానికి సంబంధించిన అనుమానాల నేపథ్యంలో, సునేత్రా పవార్ మరియు సునీల్ తత్కరే సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాన్ని వెలికితీయాలని కోరుతున్నారు. ఈ కేసు పెద్ద కంపెనీల జవాబుదారీతనానికి మరియు వినియోగదారుల హక్కులకు కూడా కీలకంగా మారింది.