Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని షాదరా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే క్రమంలో జరిగిన ఘర్షణ ఒక ప్రయాణికుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్లాట్ఫారమ్ నంబర్-3పై యోగా ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని కొందరు తోటి ప్రయాణికులు అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఈ దెబ్బలాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్కు చెందిన పంకజ్ ధామా అనే వ్యక్తి హరిద్వార్ వెళ్లేందుకు ఉదయం 6 గంటల ప్రాంతంలో షాదరా స్టేషన్కు చేరుకున్నాడు. యోగా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారమ్ పైకి రాగానే జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయాణికుల మధ్య ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఈ క్రమంలో పంకజ్కు కొందరు ప్రయాణికులతో స్వల్ప వివాదం తలెత్తింది. బోగీ గేటు వద్ద మొదలైన ఈ చిన్న గొడవ చూస్తుండగానే హింసాత్మకంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన తోటి ప్రయాణికులు పంకజ్పై దాడి చేసి, కిందపడేసి కాళ్లతో, చేతులతో విచక్షణారహితంగా బాదారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఘటనా స్థలంలో ఉన్న ఒక ఆర్పిఎఫ్ (RPF) కానిస్టేబుల్ జోక్యం చేసుకుని పంకజ్ను గుంపు నుంచి విడిపించారు. అయితే, ఆ తర్వాత అతడిని ప్లాట్ఫారమ్ ఫ్లోర్పై లాగి అలాగే వదిలేశారు. కింద పడిన సమయంలో పంకజ్ శరీరంలో స్వల్ప కదలికలు ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది అతడిని అదే స్థితిలో వదిలేసి ముందుకు సాగిపోయారు. ప్లాట్ఫారమ్పై ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ సమయానికి అతడిని ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేయలేదు. ఈ తీవ్రమైన నిర్లక్ష్యం వల్లే, సకాలంలో వైద్యం అందక పంకజ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఓల్డ్ ఢిల్లీ రైల్వే పోలీస్ స్టేషన్ (PS ODRS) బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పంకజ్ ధామాను వెంటనే తీవ్రమైన స్థితిలో జీటీబీ (GTB) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక వైద్య నివేదిక ప్రకారం, దాడి సమయంలో పంకజ్ అంతర్గత అవయవాలకు తీవ్రమైన గాయాలు కావడమే మరణానికి ప్రధాన కారణమని తేలింది. న్యూఢిల్లీ రైల్వే డీసీపీ సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘోర కలకలంపై పోలీసులు తక్షణమే స్పందించి కొత్త చట్టం ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) సెక్షన్ 105 (హత్య కాని నేరపూరిత నరహత్య), సెక్షన్ 3(5) కింద కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Also Read
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
- Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
- RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
తాజావార్తలు
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
-
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
-
Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్కు మరో భారీ అవకాశం!
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?