NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026 Re-Exam: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి సర్వసిద్ధం చేస్తోంది. అయితే, ఈ పరీక్ష జరగడానికి ముందే ఎన్టీఏ నిర్వహణా లోపాలపై మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్టీఏ చేసిన ఒక భారీ పొరపాటు కారణంగా నాగపూర్కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి ఏకంగా యూఏఈ (UAE) లోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం కొద్ది గంటల ముందే జరిగిన ఈ విచిత్ర పరిణామం సదరు విద్యార్థిని, అతని కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. నిజానికి అంతకుముందు జరిగిన మొదటి పరీక్షలో ఈ విద్యార్థి నాగపూర్లోనే పరీక్ష రాశాడు.
ఈ ఘటనతో ఎన్టీఏ పరిపాలనా విధానం, పనితీరు మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. అబ్దుల్లా తన నీట్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో తన స్థానిక ప్రాధాన్యతలుగా నాగపూర్, వార్ధా, భండారా ప్రాంతాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంచుకున్నాడు. కానీ, ఎన్టీఏ మాత్రం వీటన్నింటినీ పక్కనబెట్టి, అతని సొంత ఊరికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో సెంటర్ కేటాయించింది. ఈ హాల్ టికెట్ చూసి తమ కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైందని అబ్దుల్లా తండ్రి మీడియాతో తెలిపారు. తాము ఎంతో జాగ్రత్తగా నాగపూర్ పరిసర ప్రాంతాలనే ఎంచుకుంటే, విదేశాల్లో సెంటర్ ఎలా కేటాయించారో అస్సలు అర్థం కావడం లేదని వాపోయారు.
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
సమస్య అంతటితో ఆగలేదు.. ఆ విద్యార్థికి అసలు పాస్పోర్ట్ సైతం లేదు. ఇంత తక్కువ సమయంలో పాస్పోర్ట్, వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, పరీక్ష రాయడానికి విదేశాలకు వెళ్లడం ఆ కుటుంబానికి దాదాపు అసాధ్యమైన విషయం. ఈ ఘోర తప్పిదంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ పరీక్షా విధానాన్ని ఒక పెద్ద జోక్గా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థికి వెంటనే సవరించిన (రివైజ్డ్) అడ్మిట్ కార్డ్ను జారీ చేసి, ఈ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ దారుణమైన పొరపాటు వెలుగులోకి వచ్చిన వెంటనే, విద్యార్థి తల్లిదండ్రులు ఎన్టీఏ హెల్ప్లైన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ అధికారులు.. సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) కారణంగానే ఈ తప్పు జరిగిందని అంగీకరించారు. త్వరలోనే దీనిని సరిచేస్తామని వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, కొత్త హాల్ టికెట్ చేతికి వచ్చేంతవరకు ఆ విద్యార్థి, అతని కుటుంబం తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..