NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026 Re-Exam: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి సర్వసిద్ధం చేస్తోంది. అయితే, ఈ పరీక్ష జరగడానికి ముందే ఎన్టీఏ నిర్వహణా లోపాలపై మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్టీఏ చేసిన ఒక భారీ పొరపాటు కారణంగా నాగపూర్కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి ఏకంగా యూఏఈ (UAE) లోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం కొద్ది గంటల ముందే జరిగిన ఈ విచిత్ర పరిణామం సదరు విద్యార్థిని, అతని కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. నిజానికి అంతకుముందు జరిగిన మొదటి పరీక్షలో ఈ విద్యార్థి నాగపూర్లోనే పరీక్ష రాశాడు.
ఈ ఘటనతో ఎన్టీఏ పరిపాలనా విధానం, పనితీరు మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. అబ్దుల్లా తన నీట్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో తన స్థానిక ప్రాధాన్యతలుగా నాగపూర్, వార్ధా, భండారా ప్రాంతాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంచుకున్నాడు. కానీ, ఎన్టీఏ మాత్రం వీటన్నింటినీ పక్కనబెట్టి, అతని సొంత ఊరికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో సెంటర్ కేటాయించింది. ఈ హాల్ టికెట్ చూసి తమ కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైందని అబ్దుల్లా తండ్రి మీడియాతో తెలిపారు. తాము ఎంతో జాగ్రత్తగా నాగపూర్ పరిసర ప్రాంతాలనే ఎంచుకుంటే, విదేశాల్లో సెంటర్ ఎలా కేటాయించారో అస్సలు అర్థం కావడం లేదని వాపోయారు.
Also Read
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
- Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్గా రికార్డ్..
సమస్య అంతటితో ఆగలేదు.. ఆ విద్యార్థికి అసలు పాస్పోర్ట్ సైతం లేదు. ఇంత తక్కువ సమయంలో పాస్పోర్ట్, వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, పరీక్ష రాయడానికి విదేశాలకు వెళ్లడం ఆ కుటుంబానికి దాదాపు అసాధ్యమైన విషయం. ఈ ఘోర తప్పిదంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ పరీక్షా విధానాన్ని ఒక పెద్ద జోక్గా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థికి వెంటనే సవరించిన (రివైజ్డ్) అడ్మిట్ కార్డ్ను జారీ చేసి, ఈ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ దారుణమైన పొరపాటు వెలుగులోకి వచ్చిన వెంటనే, విద్యార్థి తల్లిదండ్రులు ఎన్టీఏ హెల్ప్లైన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ అధికారులు.. సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) కారణంగానే ఈ తప్పు జరిగిందని అంగీకరించారు. త్వరలోనే దీనిని సరిచేస్తామని వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, కొత్త హాల్ టికెట్ చేతికి వచ్చేంతవరకు ఆ విద్యార్థి, అతని కుటుంబం తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు.
తాజావార్తలు
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
-
Bandla Ganesh: ‘పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే’.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!