Sugar prices: చక్కెర చేదు కానుందా..? పెరుగనున్న చక్కెర ధరలు..
Sugar prices: ఇండియాలో చక్కెర ధరలు పెరగనున్నాయా..? అయితే పరిణామాలు చూస్తే మాత్రం రానున్న రోజుల్లో చక్కెర ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. 2023-24 క్రాప్ ఇయర్ లో చక్కెర ఉత్పత్తి 14 శాతం తగ్గింది. చక్కెర ఉత్పత్తితో తగ్గింపు ఆహార ద్రవ్యోల్భణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో కరువు పరిస్థితులు చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుందని, ధరలు పెరిగే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. భారతదేశంలో మూడొంతుల చక్కెర మహారాష్ట్రలోనే ఉత్పత్తి అవుతుంది.
ఈ ఏడాది 14 శాతం చక్కెర ఉత్పత్తిలో తగ్గుదల కనిపించవచ్చని, ఇది గడిచిన నాలుగేళ్లలో కనిష్ట ఉత్పత్తిని సూచిస్తోంది. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఆగస్టులో వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడింది. ఇది చెరుకు పంటపై ప్రభావం చూపించనుంది. దీంతో చెరుకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దేశీయం చక్కెర ఉత్పత్తి తగ్గితే భారత్ విదేశాలకు చక్కెర ఎగుమతులపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇది ప్రపంచస్థాయిలో చక్కెర ధరలపై ప్రభావం చూపిస్తుంది. దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పటికే చక్కెర ధరలు అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
Read Also: Asia cup 2023: “ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసింది”.. షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై
దేశీయంగా ధరలు పెరిగడం సంభవిస్తే, బలరాంపూర్ చిని, ద్వారికేష్ షుగర్, శ్రీ రేణుకా షుగర్స్ మరియు దాల్మియా భారత్ షుగర్ వంటి ప్రముఖ ఉత్పత్తిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కంపెనీలు మెరుగైన లాభాలను చూడొచ్చు. తద్వారా రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలవు.
వెస్ట్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీబీ థొంబారే మాట్లాడుతూ.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్ లో మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి గతేడాది 10.5 మిలియన్ టన్నుల నుండి 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. చెరుకు ఉత్పత్తికి కీలకమైన నెలలో సరైన వర్షాలు కురవలేదని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఆగస్టు నెలలో 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 20214-22 సీజన్ లో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో 13.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తిని సాధించింది. ఈ సీజన్ లో 11.2 మిలియన్ టన్నుల చక్కెరను భారత్ ఎగుమతి చేసిది. 2022-23లో 10.5 మిలియన్ టన్నులకు తగ్గింది. భారత ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కేంద్రం చక్కెర మిల్లులు ఎగుమతి చేయకుండా నిషేధం విధించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!