Asia cup 2023: “ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసింది”.. షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia cup 2023: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లోస్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 213 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా, శ్రీలంకను కేవలం 172 పరుగులకే కుప్పకూల్చింది. కుల్దీప్ యాదవ్, జస్పీత్ బూమ్రా, జడేజా, సిరాజ్ బౌలింగ్ లో సత్తా చాటారు. మన పేస్, స్పిన్ బౌలింగ్ ఆడేందుకు శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు.
ఇదిలా ఉంటే భారత్ 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా ఈ మ్యాచును ఫిక్స్ చేసిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపడానికి కావాలనే భారత్ ఓడిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కి కొంత మంది అభిమానులు ఫోన్లు చేశారు. నిన్న ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత్ 213కి ఆలౌట్ కావడంతో శ్రీలంక గెలుస్తుందని అంతా భావించారు. మొదటి ఇన్నింగ్స్ పూర్తి కాగానే పాక్ అభిమానులు ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
Also Read
Read Also:Kolkata : శ్రీలంక అధ్యక్షుడిని కలిసిన మమతా బెనర్జీ.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది దీది
‘‘మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. పాకిస్తాన్ ఫైనల్ చేరకుండా అడ్డుకునేందుకు భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోతుందని నాకు మెసేజ్లు వస్తున్నాయి. మీరు బాగానే ఉన్నారా..?’’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. వెల్లలాగే, అసలంక హార్ట్ పుల్ గా బౌలింగ్ చేయడం చూడవచ్చు. 20 ఏళ్ల పిల్లవాడు వెల్లలాగే 5 వికెట్లు తీశాడని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొన్నాడు. మ్యాచులో శ్రీలంక చూపిన పోరాటాన్ని కొనియాడారు. విజయం సాధిస్తే తప్పకుండా ఫైనల్ చేరుతామని భారత్ కు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుందని ప్రశ్నించాడు.
4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించిన కుల్దీప్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. అంతకుముందు పాక్ తో జరిగిన మ్యాచులో కుల్దీప్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. బూమ్రా, కుల్దీప్ చూడండి.. చిన్న టోటల్ ని ఎలా కాపాడుకున్నారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జట్టు సరిగా పోరాటం చేయలేదని, పేసర్లు హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాహీద్ అఫ్రిది ఫిట్నెస్ గురించి ప్రశ్నించారు. వెల్లాగే అనే 20 ఏళ్ల పిల్లవాడు ఫైట్ చూపిస్తున్నాడు. అతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేస్తున్నాడు, అతను చేయగలిగినదంతా చేస్తున్నాడు. మా ఆటగాళ్లు (పాకిస్తాన్) ఈ పోరాటాన్ని చూపించలేకపోయారని ఆరోపించాడు. ప్రస్తుత ఇండియా ఫైనల్ కి చేరుకుంది. పాక్ ఫైనల్ చేరాలంటే తరువాత జరిగే మ్యాచులో శ్రీలంక, పాకిస్తాన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?