Asia cup 2023: “ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసింది”.. షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia cup 2023: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లోస్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 213 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా, శ్రీలంకను కేవలం 172 పరుగులకే కుప్పకూల్చింది. కుల్దీప్ యాదవ్, జస్పీత్ బూమ్రా, జడేజా, సిరాజ్ బౌలింగ్ లో సత్తా చాటారు. మన పేస్, స్పిన్ బౌలింగ్ ఆడేందుకు శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు.
ఇదిలా ఉంటే భారత్ 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా ఈ మ్యాచును ఫిక్స్ చేసిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపడానికి కావాలనే భారత్ ఓడిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కి కొంత మంది అభిమానులు ఫోన్లు చేశారు. నిన్న ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత్ 213కి ఆలౌట్ కావడంతో శ్రీలంక గెలుస్తుందని అంతా భావించారు. మొదటి ఇన్నింగ్స్ పూర్తి కాగానే పాక్ అభిమానులు ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
Read Also:Kolkata : శ్రీలంక అధ్యక్షుడిని కలిసిన మమతా బెనర్జీ.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది దీది
‘‘మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. పాకిస్తాన్ ఫైనల్ చేరకుండా అడ్డుకునేందుకు భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోతుందని నాకు మెసేజ్లు వస్తున్నాయి. మీరు బాగానే ఉన్నారా..?’’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. వెల్లలాగే, అసలంక హార్ట్ పుల్ గా బౌలింగ్ చేయడం చూడవచ్చు. 20 ఏళ్ల పిల్లవాడు వెల్లలాగే 5 వికెట్లు తీశాడని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొన్నాడు. మ్యాచులో శ్రీలంక చూపిన పోరాటాన్ని కొనియాడారు. విజయం సాధిస్తే తప్పకుండా ఫైనల్ చేరుతామని భారత్ కు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుందని ప్రశ్నించాడు.
4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించిన కుల్దీప్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. అంతకుముందు పాక్ తో జరిగిన మ్యాచులో కుల్దీప్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. బూమ్రా, కుల్దీప్ చూడండి.. చిన్న టోటల్ ని ఎలా కాపాడుకున్నారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జట్టు సరిగా పోరాటం చేయలేదని, పేసర్లు హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాహీద్ అఫ్రిది ఫిట్నెస్ గురించి ప్రశ్నించారు. వెల్లాగే అనే 20 ఏళ్ల పిల్లవాడు ఫైట్ చూపిస్తున్నాడు. అతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేస్తున్నాడు, అతను చేయగలిగినదంతా చేస్తున్నాడు. మా ఆటగాళ్లు (పాకిస్తాన్) ఈ పోరాటాన్ని చూపించలేకపోయారని ఆరోపించాడు. ప్రస్తుత ఇండియా ఫైనల్ కి చేరుకుంది. పాక్ ఫైనల్ చేరాలంటే తరువాత జరిగే మ్యాచులో శ్రీలంక, పాకిస్తాన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!