Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలి.. హైకోర్టులో బీజేపీ నేత పిటిషన్..
- రాహుల్ గాంధీపై కోర్టుకెక్కిన సుబ్రమణ్య స్వామి..
- ఆయన భారత పౌరసత్వం రద్దు చేయాలని పిటిషన్..
- పలు సందర్భాల్లో బ్రిటిష్ జాతీయత ప్రకటించారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకరాం.. 2003లో యునైటెడ్ కింగ్డమ్లో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే సంస్థ రిజస్టర్ చేయబడిందని, రాహుల్ గాంధీ దాని డైరెక్టర్లు, దాని సెక్రటరిల్లో ఒకరని, 2019లోనే హోం మంత్రిత్వ శాఖకు సుబ్రమణ్య స్వామి లేఖ రాశారు.
అక్టోబర్ 10, 2005 మరియు అక్టోబర్ 31, 2006 న దాఖలు చేసిన సంస్థ వార్షిక రిటర్న్స్లో రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్గా ప్రకటించుకున్నారని స్వామి ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2009న బ్యాకప్స్ లిమిటెడ్ రద్దు అప్లికేషన్లో కూడా మళ్లీ ఆయన తన జాతీయతను బ్రిటిష్గా ప్రకటించుకున్నట్లు ఆయన పేర్కొన్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారని తెలుస్తోంది.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
Read Also: Uddhav Thackeray: ‘‘ఆ ఆస్తుల్ని తాకనివ్వం’’.. వక్ఫ్ బిల్లుపై మౌనం వీడిన ఠాక్రే..
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని స్వామి ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం-1955ని ఉల్లంఘించడమే అని ఆయన ఆరోపించారు. నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 29, 2019న హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఈ విషయంలో వాస్తవ వైఖరిని తెలపాలని కోరింది. ఆయనకు లేఖ రాసి 5 ఏళ్లు గడిచినా, రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకున్నారనే దానిపై హోంశాఖకు స్పష్టత ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తోంది.
రాహుల్ గాంధీ 5 సార్లు ఎంపీగా ఉన్నారు. 2004, 2019 వరకు ఆయన మూడు పర్యాయాలుగా అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో రెండో స్థానం వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో రాయబరేలీని నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను గెలుచుకుని, ప్రతిపక్ష ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా అవతరించింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి ప్రతిపక్ష నేత పదవి దక్కింది.
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!