Manipur voilance: మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన.. గవర్నర్ రిజైన్ చేయాలని డిమాండ్
- మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు..
- డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు..
- రాష్ట్ర గవర్నర్.. డీజీపీ.. సెక్యూరిటీ అడ్వైజర్ రాజీనామా చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur voilance: మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలువురు స్కూల్, కాలేజీ విద్యార్థులు ఇవాళ (సోమవారం) రాజ్ భవన్ వైపు ర్యాలీ తీశారు. పలు చోట్ల రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గతేడాది నుంచి కొనసాగుతున్న హింస పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, గవర్నర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేగాక నైతిక కారణాలతో 50 మంది ఎమ్మెల్యేలు సైతం రిజైన్ చేయాలని తెలిపారు. హింసాత్మక పరిస్థితులను నియంత్రించడంలో విఫలమైన పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు.డ్రోన్ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
Read Also: Peanuts health benefits: పల్లీలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
అయితే, స్టూడెంట్స్ రాజ్ భవన్ వైపు వెళ్తుండటంతో పోలీసులు, భద్రతా బలగాలు బారికేడ్లు వేసి వారిని అడ్డుకున్నారు. ఈ నిరసన గుంపును చెదర గొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధన్మంజూరి విశ్వ విద్యాలయం స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. జైలులో ఉండటానికి, ఇంఫాల్లో ఉండటానికి తేడా లేదు.. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేసేందుకే ఈ మెగా ర్యాలీ నిర్వహించామన్నారు. కాగా, గత 7 రోజులుగా రాష్ట్రంలో హింస పెరిగిపోయింది. మిలిటెంట్లు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో 8 మంది చనిపోగా.. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | Manipur: Hundreds of students march to Raj Bhavan in Imphal, demanding removal of DGP and Security Advisor over the situation in the state. pic.twitter.com/Agyim2sqDL
— ANI (@ANI) September 9, 2024
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!