Tamil Nadu: తమిళనాడులో మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- తమిళనాడులో మరో దారుణం
- విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- శాంతిభద్రతలు క్షీణించాయన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆదివారం రాత్రి కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ముగ్గురు సభ్యుల ముఠా విద్యార్థినిని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ముగ్గురు సభ్యుల ముఠా అపహరించింది. వేరే ప్రదేశానికి తీసుకుని గ్యాంగ్రేప్కు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఏడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పురోగతి తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అధికార పార్టీపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
కోయంబత్తూరు ఘటన చాలా దిగ్భ్రాంతికరం అని బీజేపీ నేత అన్నామలై అన్నారు. ‘‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం లేదా పోలీసుల పట్ల ఎలాంటి భయం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. డీఎంకే మంత్రుల నుంచి చట్ట అమలు సిబ్బంది వరకు, లైంగిక నేరస్థులను రక్షించే స్పష్టమైన ధోరణి ఉంది.’’ అని అన్నామలై ఎక్స్లో రాసుకొచ్చారు.
కోయంబత్తూరు సంఘటన దురదృష్టకరమని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!