Tamil Nadu: తమిళనాడులో మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- తమిళనాడులో మరో దారుణం
- విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- శాంతిభద్రతలు క్షీణించాయన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆదివారం రాత్రి కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ముగ్గురు సభ్యుల ముఠా విద్యార్థినిని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ముగ్గురు సభ్యుల ముఠా అపహరించింది. వేరే ప్రదేశానికి తీసుకుని గ్యాంగ్రేప్కు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఏడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పురోగతి తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అధికార పార్టీపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
కోయంబత్తూరు ఘటన చాలా దిగ్భ్రాంతికరం అని బీజేపీ నేత అన్నామలై అన్నారు. ‘‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం లేదా పోలీసుల పట్ల ఎలాంటి భయం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. డీఎంకే మంత్రుల నుంచి చట్ట అమలు సిబ్బంది వరకు, లైంగిక నేరస్థులను రక్షించే స్పష్టమైన ధోరణి ఉంది.’’ అని అన్నామలై ఎక్స్లో రాసుకొచ్చారు.
కోయంబత్తూరు సంఘటన దురదృష్టకరమని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!