Tamil Nadu: తమిళనాడులో మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- తమిళనాడులో మరో దారుణం
- విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- శాంతిభద్రతలు క్షీణించాయన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆదివారం రాత్రి కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ముగ్గురు సభ్యుల ముఠా విద్యార్థినిని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ముగ్గురు సభ్యుల ముఠా అపహరించింది. వేరే ప్రదేశానికి తీసుకుని గ్యాంగ్రేప్కు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
Also Read
యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఏడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పురోగతి తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అధికార పార్టీపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
కోయంబత్తూరు ఘటన చాలా దిగ్భ్రాంతికరం అని బీజేపీ నేత అన్నామలై అన్నారు. ‘‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం లేదా పోలీసుల పట్ల ఎలాంటి భయం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. డీఎంకే మంత్రుల నుంచి చట్ట అమలు సిబ్బంది వరకు, లైంగిక నేరస్థులను రక్షించే స్పష్టమైన ధోరణి ఉంది.’’ అని అన్నామలై ఎక్స్లో రాసుకొచ్చారు.
కోయంబత్తూరు సంఘటన దురదృష్టకరమని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!