PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
- ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం
- అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ (ESTIC) 2025ను ప్రధాని మోడీ ప్రారంభించి ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దశాబ్దం క్రితం వరకు మహిళల సంఖ్య 100 కంటే చాలా తక్కువగా ఉండేదని.. ఇప్పుడు ఏకంగా 5, 000 వరకు చేరుకుందని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యలో మహిళల వాటా దాదాపు 43 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అని వివరించారు. అభివృద్ధి చెందిన దేశానికి చెందిన సైన్ అండ్ టెక్నాలజీ మంత్రితో లిఫ్ట్లో వస్తుండగా.. భారతీయ అమ్మాయిలు సైన్స్ అండ్ టెక్నాలజీని అనుసరిస్తున్నారా? అని అడిగారని.. మన సంఖ్య చెప్పగానే ఆశ్చర్యపోయారని తెలిపారు. మన భారతీయ కుమార్తెలు సాధించినది ఇదేనన్నారు. దీనిని బట్టి భారతదేశంలోని మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారో గణంకాలు చూపిస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ఇక ఏఐ శక్తిని కూడా ఉపయోగకరంగా మారుస్తామని.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేడు రిటైల్ నుంచి లాజిస్టిక్స్ వరకు.. కస్టమర్ సర్వీస్ నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతిచోటా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించబడుతోంది. అందువల్ల భారతదేశంలో కూడా సమాజంలోని ప్రతి విభాగానికి ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తున్నాము. ఇండియా ఏఐ మిషన్లో రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. నేడు భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత ఏఐ కోసం ప్రపంచ చిత్రాన్ని రూపొందిస్తోంది. మా రాబోయే ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఒక ప్రధాన అడుగు అవుతుంది. ఆవిష్కరణ, భద్రతను కలిసి అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారతదేశం గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మన శక్తిని రెట్టింపు చేసుకోవాల్సిన సమయం ఇది. అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన లక్ష్యాన్ని సాధించడానికి ఇది కూడా చాలా కీలకం.’’ అవుతుందని మోడీ ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
నవంబర్ 3–5 వరకు జరిగే సమావేశంలో నోబెల్ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలతో పాటు విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం నుండి 3,000 మందికి పైగా పాల్గొన్నారు.
#WATCH | Delhi: At the Emerging Science, Technology and Innovation Conclave (ESTIC) 2025, PM Narendra Modi says, "…In patent filings, the number of women in this field annually was less than 100 a decade ago. Now, it has reached over 5,000 annually…The share of women in STEM… pic.twitter.com/niDnhgYYel
— ANI (@ANI) November 3, 2025
#WATCH | Delhi: At the Emerging Science, Technology and Innovation Conclave (ESTIC) 2025, PM Narendra Modi says, "Today, AI (Artificial Intelligence) is being used everywhere, from retail to logistics, from customer service to children's homework. Therefore, in India too, we are… pic.twitter.com/JB5zvRsHae
— ANI (@ANI) November 3, 2025
#WATCH | Prime Minister Narendra Modi participated in the Emerging Science, Technology and Innovation Conclave (ESTIC) 2025 at Bharat Mandapam, New Delhi.
ESTIC 2025 will be held from 3–5 November 2025. The conclave will bring together over 3,000 participants from academia,… pic.twitter.com/tovgdp8XPB
— ANI (@ANI) November 3, 2025
India is rapidly building a vibrant ecosystem for research and development. Addressing the Emerging Science, Technology and Innovation Conclave in New Delhi. https://t.co/jIhdvjraIy
— Narendra Modi (@narendramodi) November 3, 2025
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!