UP: ఘోరం.. రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం
- మనస్తాపంతో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులంతా సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఫీజుల కోసం యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని.. లేదంటే రాయిపించమని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ పరిణామాలు ఒక విద్యార్థిని మనసును తీవ్రంగా కలిచివేసేసింది. యాజమాన్యాల క్రూరత్వానికి.. ఓ తల్లికి గర్భశోకాన్ని ముగిల్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
కేవలం అంటే కేవలం రూ.800 స్కూల్ ఫీజు చెల్లించలేదని తొమ్మిది తరగతి విద్యార్థినిని పరీక్ష రాయకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. సంవత్సరమంతా కష్టపడి చదివి.. చివరి ఎగ్జామ్ రాయనివ్వకపోవడంతో విద్యార్థిని తీవ్రంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలోని జెత్వారాలో చోటుచేసుకుంది. పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు… కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ఈ ఘటనపై బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.1,500 చెల్లించానని. ఇంకా రూ.800 చెల్లించాల్సి ఉందని తెలిపింది. కానీ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకున్నారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. పాఠశాల మేనేజర్ సంతోష్ కుమార్ యాదవ్, పాఠశాల అధికారి దీపక్ సరోజ్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ యాదవ్, ఇతరులు బహిరంగంగా అవమానించి పరీక్ష రాయనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అవమానం భరించలేకే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని.. దీనికి కారకులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
బాలల ఆత్మహత్యకు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 107 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై స్థానిక పంచాయతీ సభ్యుడు, న్యాయవాది మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దుర్గేష్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!