UP: ఘోరం.. రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం
- మనస్తాపంతో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులంతా సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఫీజుల కోసం యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని.. లేదంటే రాయిపించమని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ పరిణామాలు ఒక విద్యార్థిని మనసును తీవ్రంగా కలిచివేసేసింది. యాజమాన్యాల క్రూరత్వానికి.. ఓ తల్లికి గర్భశోకాన్ని ముగిల్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
కేవలం అంటే కేవలం రూ.800 స్కూల్ ఫీజు చెల్లించలేదని తొమ్మిది తరగతి విద్యార్థినిని పరీక్ష రాయకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. సంవత్సరమంతా కష్టపడి చదివి.. చివరి ఎగ్జామ్ రాయనివ్వకపోవడంతో విద్యార్థిని తీవ్రంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలోని జెత్వారాలో చోటుచేసుకుంది. పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు… కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఈ ఘటనపై బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.1,500 చెల్లించానని. ఇంకా రూ.800 చెల్లించాల్సి ఉందని తెలిపింది. కానీ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకున్నారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. పాఠశాల మేనేజర్ సంతోష్ కుమార్ యాదవ్, పాఠశాల అధికారి దీపక్ సరోజ్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ యాదవ్, ఇతరులు బహిరంగంగా అవమానించి పరీక్ష రాయనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అవమానం భరించలేకే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని.. దీనికి కారకులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
బాలల ఆత్మహత్యకు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 107 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై స్థానిక పంచాయతీ సభ్యుడు, న్యాయవాది మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దుర్గేష్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!