UP: ఘోరం.. రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం
- మనస్తాపంతో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులంతా సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఫీజుల కోసం యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని.. లేదంటే రాయిపించమని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ పరిణామాలు ఒక విద్యార్థిని మనసును తీవ్రంగా కలిచివేసేసింది. యాజమాన్యాల క్రూరత్వానికి.. ఓ తల్లికి గర్భశోకాన్ని ముగిల్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
కేవలం అంటే కేవలం రూ.800 స్కూల్ ఫీజు చెల్లించలేదని తొమ్మిది తరగతి విద్యార్థినిని పరీక్ష రాయకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. సంవత్సరమంతా కష్టపడి చదివి.. చివరి ఎగ్జామ్ రాయనివ్వకపోవడంతో విద్యార్థిని తీవ్రంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలోని జెత్వారాలో చోటుచేసుకుంది. పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు… కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
ఈ ఘటనపై బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.1,500 చెల్లించానని. ఇంకా రూ.800 చెల్లించాల్సి ఉందని తెలిపింది. కానీ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకున్నారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. పాఠశాల మేనేజర్ సంతోష్ కుమార్ యాదవ్, పాఠశాల అధికారి దీపక్ సరోజ్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ యాదవ్, ఇతరులు బహిరంగంగా అవమానించి పరీక్ష రాయనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అవమానం భరించలేకే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని.. దీనికి కారకులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
బాలల ఆత్మహత్యకు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 107 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై స్థానిక పంచాయతీ సభ్యుడు, న్యాయవాది మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దుర్గేష్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!