Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భర్తలకు తమ భార్యలు తీసుకువచ్చిన స్త్రీధనంపై నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపద సమయాల్లో వాటిని ఉపయోగించినప్పటికీ, అది స్త్రీలకు చెందిన సంపూర్ణ ఆస్తిగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒక మహిళ పోగొట్టుకున్న బంగారానికి బదులుగా రూ.25 లక్షలు చెల్లించాలని ఒక వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భర్తలు తమ భార్యలకు ‘స్త్రీ ధన్’ని తిరిగి ఇవ్వా్ల్సిన నైతిక బాద్యతను ఎత్తి చూపింది.
తన వివాహం సమయంలో తన కుటుంబం 89 సవర్ల బంగారం గిఫ్టుగా ఇచ్చిందని, తన తండ్రి రూ. 2 లక్షల చెక్కుని తన భర్త బహుమతిగా ఇచ్చారని మహిళ పేర్కొంది. అయితే, తన బంగారు ఆభరణాలన్నింటిని తన భర్త స్వాధీనం చేసుకుని, భద్రపరిచే నెపంతో అతని తల్లికి ఇచ్చాడని చెప్పింది. అయితే, తన భర్త, అత్తగారు వారి ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి తన బంగారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
2011లో కుటుంబ న్యాయస్థానం ఈ కేసును విచారించి మహిళ బంగారు ఆభరణాలని భర్త, అతని తల్లి దుర్వినియోగం చేశారని సదరు మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, మహిళ తన వాదనల్ని రుజువు చేయలేదని పేర్కొంటూ కేరళ హైకోర్టు ఈ నిర్ణయాన్ని పాక్షికంగా రద్దు చేసింది. స్త్రీధనం అనేది మహిళ ఆస్తిగా మిగిలిపోతుందని, దానిపై భర్తకు నియంత్రణ ఉండదనే సూత్రాన్ని సమర్థిస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వివాహంలో నమ్మకం, పరస్పర అవగాహన అవసరమని, మొదటి నుంచి స్త్రీ తన భర్తను విశ్వసించలేదని భావించడం అసంభవమని కోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది. పెళ్లి ఫోటోలను చూస్తే సదరు మహిళ అత్తగారింటికి తగినంత నగలను తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాలక్రమేణా జీవన వ్యయం పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, 2009లో రూ. 8.90 లక్షల విలువైన 89 సవర్ల బంగారానికి బదులుగా మహిళకు రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!