Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భర్తలకు తమ భార్యలు తీసుకువచ్చిన స్త్రీధనంపై నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపద సమయాల్లో వాటిని ఉపయోగించినప్పటికీ, అది స్త్రీలకు చెందిన సంపూర్ణ ఆస్తిగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒక మహిళ పోగొట్టుకున్న బంగారానికి బదులుగా రూ.25 లక్షలు చెల్లించాలని ఒక వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భర్తలు తమ భార్యలకు ‘స్త్రీ ధన్’ని తిరిగి ఇవ్వా్ల్సిన నైతిక బాద్యతను ఎత్తి చూపింది.
తన వివాహం సమయంలో తన కుటుంబం 89 సవర్ల బంగారం గిఫ్టుగా ఇచ్చిందని, తన తండ్రి రూ. 2 లక్షల చెక్కుని తన భర్త బహుమతిగా ఇచ్చారని మహిళ పేర్కొంది. అయితే, తన బంగారు ఆభరణాలన్నింటిని తన భర్త స్వాధీనం చేసుకుని, భద్రపరిచే నెపంతో అతని తల్లికి ఇచ్చాడని చెప్పింది. అయితే, తన భర్త, అత్తగారు వారి ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి తన బంగారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
2011లో కుటుంబ న్యాయస్థానం ఈ కేసును విచారించి మహిళ బంగారు ఆభరణాలని భర్త, అతని తల్లి దుర్వినియోగం చేశారని సదరు మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, మహిళ తన వాదనల్ని రుజువు చేయలేదని పేర్కొంటూ కేరళ హైకోర్టు ఈ నిర్ణయాన్ని పాక్షికంగా రద్దు చేసింది. స్త్రీధనం అనేది మహిళ ఆస్తిగా మిగిలిపోతుందని, దానిపై భర్తకు నియంత్రణ ఉండదనే సూత్రాన్ని సమర్థిస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వివాహంలో నమ్మకం, పరస్పర అవగాహన అవసరమని, మొదటి నుంచి స్త్రీ తన భర్తను విశ్వసించలేదని భావించడం అసంభవమని కోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది. పెళ్లి ఫోటోలను చూస్తే సదరు మహిళ అత్తగారింటికి తగినంత నగలను తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాలక్రమేణా జీవన వ్యయం పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, 2009లో రూ. 8.90 లక్షల విలువైన 89 సవర్ల బంగారానికి బదులుగా మహిళకు రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!