Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భర్తలకు తమ భార్యలు తీసుకువచ్చిన స్త్రీధనంపై నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపద సమయాల్లో వాటిని ఉపయోగించినప్పటికీ, అది స్త్రీలకు చెందిన సంపూర్ణ ఆస్తిగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒక మహిళ పోగొట్టుకున్న బంగారానికి బదులుగా రూ.25 లక్షలు చెల్లించాలని ఒక వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భర్తలు తమ భార్యలకు ‘స్త్రీ ధన్’ని తిరిగి ఇవ్వా్ల్సిన నైతిక బాద్యతను ఎత్తి చూపింది.
తన వివాహం సమయంలో తన కుటుంబం 89 సవర్ల బంగారం గిఫ్టుగా ఇచ్చిందని, తన తండ్రి రూ. 2 లక్షల చెక్కుని తన భర్త బహుమతిగా ఇచ్చారని మహిళ పేర్కొంది. అయితే, తన బంగారు ఆభరణాలన్నింటిని తన భర్త స్వాధీనం చేసుకుని, భద్రపరిచే నెపంతో అతని తల్లికి ఇచ్చాడని చెప్పింది. అయితే, తన భర్త, అత్తగారు వారి ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి తన బంగారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Read Also: Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
2011లో కుటుంబ న్యాయస్థానం ఈ కేసును విచారించి మహిళ బంగారు ఆభరణాలని భర్త, అతని తల్లి దుర్వినియోగం చేశారని సదరు మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, మహిళ తన వాదనల్ని రుజువు చేయలేదని పేర్కొంటూ కేరళ హైకోర్టు ఈ నిర్ణయాన్ని పాక్షికంగా రద్దు చేసింది. స్త్రీధనం అనేది మహిళ ఆస్తిగా మిగిలిపోతుందని, దానిపై భర్తకు నియంత్రణ ఉండదనే సూత్రాన్ని సమర్థిస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వివాహంలో నమ్మకం, పరస్పర అవగాహన అవసరమని, మొదటి నుంచి స్త్రీ తన భర్తను విశ్వసించలేదని భావించడం అసంభవమని కోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది. పెళ్లి ఫోటోలను చూస్తే సదరు మహిళ అత్తగారింటికి తగినంత నగలను తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాలక్రమేణా జీవన వ్యయం పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, 2009లో రూ. 8.90 లక్షల విలువైన 89 సవర్ల బంగారానికి బదులుగా మహిళకు రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!