Sambhal: సంభాల్లో బయటపడుతున్న పురాతన ఆనవాళ్లు.. వెలుగులోకి 1857 నాటి బావి..
- సంభాల్లో బయటపడుతున్న పురాతన కట్టడాలు..
- తాజాగా తవ్వకాల్లో బయటడపడిన మెట్ల బావి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal: ఇటీవల మసీదు సర్వే సమయంలో అల్లర్లు జరగడంతో ఒక్కసారి ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ అల్లర్ల తరువాత జరిగిన పరిణామాల్లో సంభాల్లో అనేక పురాతన హిందూ దేవాలయాలు, బావులు బయటపడ్డాయి. తాజాగా శనివారం సర్వే చేస్తుందడగా సంభాల్లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని కనుగొన్నారు.
నివేదిక ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అదే ప్రాంతంలో పురాతన బాంకే బిహారీ ఆలయ శిథిలాలను కొనుగొన్నారు. దీని తర్వాత తాజాగా ‘‘రాణి కి బావడి’’ అనే మెట్ల బావిని కనుగొనడటం జరిగింది. సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా ఆదివారం రోజు 400 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న బావిని కనుగొన్నట్లు ధృవీకరించారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉణ్నాయని తెలిపారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
శుక్రవారం, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సంభాల్లోని కార్తికేయ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. 1978 మత అల్లర్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి హిందువులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూసేసి ఉంది. దీంతో పాటు భద్రక్ ఆశ్రమం, స్వర్గ్దీప్, చక్రపాణి సహా పరిసర ప్రాంతాల్లోని ఐదు పుణ్యక్షేత్రాలను పరిశీలించడంతో పాటు 19 బావుల్ని సర్వే చేశారు.
సంభాల్లో ఆక్రమణలకు నిరోధిస్తూ బుల్డోజర్ యాక్షన్ తీసుకున్న సమయంలో ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీదు నుంచి కూతవేటు దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో ఒక గుంపు అధికారులపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సమయంలోనే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!