Sambhal: సంభాల్లో బయటపడుతున్న పురాతన ఆనవాళ్లు.. వెలుగులోకి 1857 నాటి బావి..
- సంభాల్లో బయటపడుతున్న పురాతన కట్టడాలు..
- తాజాగా తవ్వకాల్లో బయటడపడిన మెట్ల బావి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal: ఇటీవల మసీదు సర్వే సమయంలో అల్లర్లు జరగడంతో ఒక్కసారి ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ అల్లర్ల తరువాత జరిగిన పరిణామాల్లో సంభాల్లో అనేక పురాతన హిందూ దేవాలయాలు, బావులు బయటపడ్డాయి. తాజాగా శనివారం సర్వే చేస్తుందడగా సంభాల్లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని కనుగొన్నారు.
నివేదిక ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అదే ప్రాంతంలో పురాతన బాంకే బిహారీ ఆలయ శిథిలాలను కొనుగొన్నారు. దీని తర్వాత తాజాగా ‘‘రాణి కి బావడి’’ అనే మెట్ల బావిని కనుగొనడటం జరిగింది. సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా ఆదివారం రోజు 400 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న బావిని కనుగొన్నట్లు ధృవీకరించారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉణ్నాయని తెలిపారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
శుక్రవారం, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సంభాల్లోని కార్తికేయ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. 1978 మత అల్లర్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి హిందువులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూసేసి ఉంది. దీంతో పాటు భద్రక్ ఆశ్రమం, స్వర్గ్దీప్, చక్రపాణి సహా పరిసర ప్రాంతాల్లోని ఐదు పుణ్యక్షేత్రాలను పరిశీలించడంతో పాటు 19 బావుల్ని సర్వే చేశారు.
సంభాల్లో ఆక్రమణలకు నిరోధిస్తూ బుల్డోజర్ యాక్షన్ తీసుకున్న సమయంలో ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీదు నుంచి కూతవేటు దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో ఒక గుంపు అధికారులపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సమయంలోనే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!