Bangladesh: హసీనా సైలెంట్గా ఉండాలి లేకపోతే ఆమెకి, భారత్కి మంచిది కాదు.. బంగ్లా చీఫ్ వార్నింగ్..
- షేక్ హసీనా సైలెంట్గా ఉండాలి..
- ఇది బంగ్లాకి భారత్కి మంచిది కాదు..
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత హెచ్చరికలు..
- హసీనాను తమకు అప్పగివ్వాలని కోరుతాం..
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్ ఆమెను అప్పగించాలని ఇండియాను కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని కోరారు. ఇది బంగ్లాకు, భారత్కి మంచిదని చెప్పారు. భారత్తో బంగ్లా బలమైన సంబంధాలకు విలువనిస్తుండగా, ‘‘ అవామీ లీగ్ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఇస్లామిక్గా చిత్రీకరించి, షేక్ హసీనా లేకుండా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్గా మారుతుందనే కథనాన్ని విడిచి న్యూఢిల్లీ ముందుకు సాగాలి’’ యూనస్ అన్నారు.
భారత్లో కూడా ఆమె వైఖరితో ఎవరూ సుఖంగా లేరని, ఎందుకు ఆమెని తిరిగి తమకు అప్పగించాలని మేము కోరుతామని అతను చెప్పాడు. ఆమె మౌనంగా ఉంటే మేము, మా ప్రజలు ఆమెని మరిచిపోయేవాళ్లం. ఆమె తన సొంత ప్రపంచంలో ఉండేదాన్ని కూడా మరిచిపోయేవారు అని ఆయన అన్నారు. కానీ ఆమె భారతదేశంలో కూర్చొని మాట్లాడటం, ఎవరికీ ఇష్టం లేదు అని చెప్పారు.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: IC-814 hijacking: “డాక్టర్” ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు.. కాందహార్ హైజాక్ ఘటనలో చేదు నిజాలు..
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా సాగిన హింసాత్మక ఆందోళన నేపథ్యంలో ఆగస్టు 05న ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయారు. ప్రస్తుతం ఆమెకు భారత్ రాజకీయ ఆశ్రయం కల్పించింది. ఇదిలా ఉంటే, ఆమె బంగ్లా వదిలేసిన తర్వాత అక్కడ ఆమె పార్టీ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తల హత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో పాటు ఆమెపై బంగ్లాదేశ్లో ఉగ్రవాద, విధ్వంస నేరాలు, హత్య నేరాల కింద పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆమెపై విచారణ సాగుతుందని యూనస్ ఇటీవల స్పష్టం చేశారు.
‘‘ఆమె మౌనంగా ఉండాలని మేము గట్టిగా చెబుతున్నాము. ఇది మా ఫ్రెండ్లీ రిక్వెస్ట్. ఆమెకి అక్కడ(భారత్)లో ఆశ్రయం కల్పించబడింది. ఆమె అక్కడ నుంచి ప్రచారం చేస్తోంది. ఆమె సాధారణ స్థితిలో అక్కడికి వెళ్లింది కాదు. ప్రజల ఆగ్రహం తిరుగుబాటుతో ఆమె పారిపోయింది’’ అని అతను చెప్పారు. బంగ్లాదేశ్ దురాగతాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలకు న్యాయం జరిగేలా తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని, న్యాయం జరగాలంటే ఆమెను తిరిగి దేశానికి తీసుకురావాలని యూనస్ పేర్కొన్నారు. ఆమెను తిరిగితీసుకురాకుంటే ప్రజలు శాంతించరు, ఆమె చేసి అఘాయిత్యాలను ఇక్కడ అందరి ముందు విచారించాల్సి ఉంటుంది. ఇండొ-బంగ్లా సంబంధాలు కీలకమని, అయితే, హసీనాను భారత్, తమకు అప్పగించాలని బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ వ్యాఖ్యానించిన కోన్ని రోజులకే యూనస్ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?