Stampede: విజయ్ ర్యాలీలపై బ్యాన్..కోర్టుకు వెళ్లిన బాధితుడు..
- విజయ్ ర్యాలీలను బహిష్కరించాలి..
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede: తమిళనాడు కరూర్లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అధికార డీఎంకే పార్టీ నేతలు విజయ్పై విరుచుకుపడుతున్నారు. పోలీసు నిబంధనలు పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఈ విషాద ఘటనలో 40 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు.
అయితే, తొక్కిసలాటలో గాయపడినట్లు చెప్పుకుంటున్న బాధితుడు సెంథిల్ కన్నన్, ఈ రోజు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించనునంది. ఈ విషాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు టీవీకే బహిరంగ సభలను నిషేధించాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్దారుడు కన్నన్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రమాదం కాదని, నిర్లక్ష్య ప్రణాళిక, తీవ్ర దుర్వినియోగం, ప్రజా భద్రతను పూర్తిగా విస్మరించడం వల్ల సంభవించిన ప్రత్యక్ష ఫలితం అని అన్నారు.
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
Read Also: Tamil Nadu : తమిళనాడు డీజీపీ వెంకటరామన్ స్పందన, విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, ప్రజాభద్రత ప్రమాదంలో పడినప్పుడు, సమావేశాలు నిర్వహించే హక్కును రద్దు చేయాలని వాదించారు. తమిళనాడు పోలీసులు టీవీకే ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. తొక్కిసలాట విషాదానికి సంబంధించి కరూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కూడా పిటిషన్ ఎత్తి చూపింది.
కరూర్లోని వేలుస్వామిపురంలో శనివారం జరిగిన ర్యాలీలో విజయ్ ఆలస్యంగా రావడంతో పెద్ద సంఖ్యలో జనం రావడం వల్ల ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్, జస్టిస్ జస్టిస్ అరుణా జగదీసన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పలువురు టీవీకే అగ్ర నాయకత్వంపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, స్వతంత్ర విచారణ జరిపించాలని, ఈ ఘటనలో కుట్రకోణం ఉందని, సీబీఐ దర్యాప్తు చేయాలని విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?