Srilanka: ఆ చైనీస్ నౌక రావడంపై భారత్ అభ్యంతరం.. ఫలించిన భారత్ ఒత్తడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India objected to China’s Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రంలో చౌనా పరిశోధన నౌక తిరగడాన్ని భారత్ తీవ్రంగా భావిస్తోంది. అయితే శ్రీలంక నౌక రావడాన్ని వాయిదా వేయాలని చైనాకు సూచించింది. హంబన్ టోటా రేవును 99 ఏళ్ల లీజుకు చైనా తీసుకుంది. దీన్ని సైనికపరంగా చైనా ఉపయోగించుకుంటుందని భారత్ కలవరపడుతోంది.
ఇదిలా ఉంటే ఆగస్టు 5న శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాక యువాన్ వాంగ్ 5 నౌక రావడాన్ని నిలిపివేయాలని కోరుతూ.. చైనా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. అయితే ఈ సమస్యపై చర్చిండానికి చైనా శ్రీలంకలో అత్యవసర సమావేశాన్ని కోరింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో జూలై 12న అప్పటి శ్రీలంక ప్రభుత్వం, చైనా నౌక రావడాన్ని ఆమోదించింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు హిందూ మహాసముద్ర వాయువ్య భాగంలో ఉపగ్రహ నియంత్రణ, పరిశోధన ట్రాకింగ్ కోసం ఈ నౌకను చైనా పంపింది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Taapsee Pannu: నా శృంగార జీవితం అలా లేదు.. అందుకే!
ఈ నౌక ద్వారా ఉపగ్రహాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేసే సామర్థ్యం ఉన్నందువల్ల భారత్ నిరసన తెలిపింది. ఈ నౌక శ్రీలంకకు వెళ్లే క్రమంలో భారత్ కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉంది. దీంతో భారత్ తన ఆందోళనలను శ్రీలంకకు వ్యక్త పరిచింది. గతంలో రాజపక్స హయాంలో 2014లో చైనా అణు జలంతర్గామికి శ్రీలంక అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శ్రీలంకకు ప్రధాన రుణదాతగా ఉన్న చైనా.. రుణాల ఊబిలో శ్రీలంకను ఇరికించి హంబన్ టోటా పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది.
అయితే ఇటీవల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు కేవలం భారత్ మాత్రమే సహాయం అందించింది. రుణాలు ఇచ్చిన చైనా మాత్రం శ్రీలంకను పట్టించుకోలేదు. దాదాపుగా 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని భారత్, శ్రీలంకకు అందించింది. ప్రస్తుతం భారత్ ను కాదంటే మళ్లీ శ్రీలంక పరిస్థితి మారే అవకాశం ఉంది. దీంతోనే ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం చైనా యువాన్ వాంగ్-5 నౌక రావడానికి నో చెప్పింది.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!