Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఉదంతం దేశరాజధానిని తీవ్రంగా కలచివేసింది. 21 మంది ప్రాణాలను బలితీసుకుని, మరో 28 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకునే క్రమంలో తాజాగా శనివారం నాడు హోటల్ వంటమనిషి కేశవ్ నేగి (65)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్షాద్ గార్డెన్కు చెందిన ఈయన నిర్లక్ష్యం వల్లే ఐదు అంతస్తుల భవనం చూస్తుండగానే అగ్నిఆహుతి అయిందని ప్రాథమిక విచారణలో తేలింది. జూన్ 3న మాలవీయ నగర్లోని హౌజ్ రాణి ప్రాంతంలో నడుస్తున్న ‘ఫ్లోరిష్ స్టే హోటల్’లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక హోటల్ యాజమాన్యం చేసిన బాగోతాలు, భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ హోటల్కు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు (ఫైర్ ఎన్ఓసీ) లేవని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారు బయటపడటానికి ఎలాంటి మార్గాలు లేకపోవడం మరణాల సంఖ్యను పెంచింది. భవనానికి కేవలం ఒకే ఒక ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి ఉంచడం, పైగా ప్రధాన ద్వారం సెన్సార్తో పనిచేసేది కావడం వల్ల ప్రమాదం జరగ్గానే కరెంట్ పోయి గేట్లు లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఉన్నవారు ఊపిరాడక, బయటకు రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ దారుణంలో మరణించిన 21 మందిలో పది మంది భారతీయులు కాగా, తొమ్మిది మంది ఆఫ్రికన్ దేశాలకు చెందినవారు, ఇద్దరు తుర్క్మెనిస్తాన్ పౌరులు ఉన్నారు.
హోటల్ యజమాని ఇల్లీగల్ దందాలు..
ఈ కేసుకు సంబంధించి హోటల్ యజమాని లవ్కేష్ బజాజ్ను పోలీసులు అంతకుముందే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బజాజ్ దంపతులపై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, తీవ్రంగా గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రస్తుతం సాకేత్ కోర్టు ఇతడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బజాజ్పై హత్యకు సమానమైన నేరపూరిత నరహత్య, అగ్నిప్రమాదానికి కారణమవ్వడం, ఆస్తి నష్టం కలిగించడం, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. అయితే బజాజ్ కేవలం హోటల్ నిర్వహణలోనే కాకుండా, చట్టవ్యతిరేకమైన ఇతర దందాల్లోనూ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ (అక్రమ వలసలు) కేసులో సైతం బజాజ్ హస్తం ఉన్నట్లు బయటపడింది. బంగ్లాదేశ్కు చెందిన స్వీటీ సర్కార్, ఆమె కుమార్తె పుష్పో సర్కార్ అనే ఇద్దరు మహిళలు భారీగా డబ్బులు ఆశజూపడంతో బజాజ్ తన చత్తర్పూర్ నివాస విలాసాన్ని (అడ్రస్ను) వాడుకోవడానికి అనుమతించాడు. ఆ అడ్రస్ ఆధారంగానే సదరు బంగ్లాదేశీయులు నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను, పాస్పోర్టులను సంపాదించి ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇప్పటికే బజాజ్తో పాటు ఆ ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని భవనాల ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అనధికారిక నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ ఘోర విషాదానికి కారణమైన హోటల్ యజమానులైనా, వెనకుండి నడిపించిన అధికారులైనా సరే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, బాధ్యులందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!