Jharkhand: హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ప్రకంపనలు.. అధికార మార్పుపై జోరుగా చర్చ
- జార్ఖండ్లో రాజకీయ ప్రకంపనలు
- అధికార మార్పుపై జోరుగా చర్చ
- సోషల్ మీడియాలో జేఎంఎం కీలక పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్లో కీలక పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు.. చివరికి తేలిందిదే!
Also Read
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
ఇటీవల హేమంత్ సోరెన్-కల్పనా సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బీజేపీ అగ్ర నాయకులను రహస్యంగా కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హేమంత్ సోరెన్ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లుగా కథనాలు పేర్కొంటున్నాయి. బీజేపీతో పొత్తుకు కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
బీహార్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి సరిగ్గా పట్టించుకోలేదని హేమంత్ దంపతులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో హేమంత్ సోరెన్ దంపతులు రహస్య చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం జరగడంతో జేఎంఎం సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టింది. ‘జార్ఖండ్ తలవంచదు’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ పోస్ట్ అర్థం వేరే అంటూ మాట్లాడుతున్నారు.

పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జేఎంఎం నాయకుడు వినోద్ పాండే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటన వ్యక్తిగత హోదాలోనే జరిగిందని, బీజేపీ కుట్రలు పన్నడం అలవాటుగా ఉందని, ఈసారి కూడా అందుకు భిన్నంగా లేదని అన్నారు.
ఇక అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలను రాష్ట్ర బీజేపీ కూడా తోసిపుచ్చింది. బీజేపీ-జేఎంఎం వ్యతిరేక తీరాలు అని.. ఎప్పటికీ కలవలేవని పేర్కొన్నారు. జేఎంఎం ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే నమ్ముతుందని.. భవిష్యత్లో కూడా కలిసి వచ్చే అవకాశం లేదని ప్రతుల్ షాదేవ్ అన్నారు. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ చనిపోయినప్పుడు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అనంతరం హేమంత్ సోరెన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
झारखंड झुकेगा नहीं।
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) December 2, 2025
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!