Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా గాంధీ.. ఆమె వెంటే రాహుల్, ప్రియాంకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధం అవుతోంది. పెరుగుతున్న ధరలకు నిరసనగా సెప్టెంబర్ 4న కాంగ్రెస్ ‘మెహంగై పర్ హల్లా బోల్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో’ యాత్ర జరగనుంది. బీజేపీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ యాత్ర చేయనున్నారు. ఈ బిజీ షెడ్యూల్ ఉన్న క్రమంలోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విదేశాలకు వెళ్తున్నారనే వార్త వెలువడింది. అయితే ఏ తేదీన వెళ్తారనే దానిపై స్పష్టత లేదు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
ఇక కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీలోని తన పదవులకు రాజీనామా చేశారు. ఇదే దారిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆనంద్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ఎన్నికలు ఉన్న సమయంలో ఆయన రాజీనామా పార్టీకి ఎదురుదెబ్బే.
సోనియాగాంధీ కోవిడ్ 19కి పాజిటివ్ బారినపడ్డారు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం సోనియాగాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో సమావేశం అయ్యారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!