Seetha Payanam trailer: మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై తెరకెక్కిన కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించగా, ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
READ ALSO: Off The Record : తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఇలాకాలో కబ్జాల కలకలం!
తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అందరినీ ఎమోషనల్గా టచ్ చేస్తోంది. ‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను.. ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. బ్యూటీఫుల్ విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ ట్రైలర్లో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా చేసిన పోరాట సన్నివేశాలు అట్రాక్షన్గా నిలిచాయి. మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని ఈ ట్రైలర్లో జోడించారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
READ ALSO: IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే!