Sonia Gandhi: సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్లు, స్వల్పంగా జ్వరం ఉన్నట్లు కాంగ్రెస్ అధకార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. కరోనా నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరుకున్నారు.
నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. జూన్ 8న సోనియాగాంధీని ఈడీ పిలిచింది. ఇదే విధంగా ఎంపీ రాహుల్ గాంధీని కూడా హాజరుకావాల్సిందిగా కోరింది. అయితే రాహుల్ విదేశాల్లో ఉండటంతో జూన్ 5 తర్వాతే ఈడీ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోనియాగాంధీకి కరోనా సోకడంతో ఈడీ ముందు హాజరయ్యేందుకు మరో తేదీని కోరవచ్చు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే ఈడీ మనిలాండరింగ్ కేసులపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రానికి ఎదురుగా నిలుస్తున్నామనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ ఈడీ,ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదురించిన కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ కేసులకు భయపడరని.. పోరాడుతాం..గెలుస్తాం.. తలవంచబోం అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఈడీ ఎదుట హాజరవుతారని.. మేం కేసులను ఎదుర్కొంటాం అని.. ఇలాంటి వ్యూహాకు భయపడం అని పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ బుధవారం బీజేపీని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాంటి కేసులను కక్షపూరితంగా పెడుతోందని.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని..దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని రణ్ దీప్ సుర్జేవాాలా విమర్శించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!