Sonia Gandhi: బీజేపీ గాంధీ హంతకులను ఆరాధిస్తోంది…మైనారిటీలను అణచివేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కీలక నేతలు ఉదయ్ పూర్ తరలివెళ్లారు. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన సూచనలు చేశారు.
ఇదిలా ఉంటే తొలి రోజే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ గాంధీ హంతకులను ఆరాధిస్తోందని.. మైనారిటీలను క్రూరంగా అణచివేస్తోందిని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటి అనుబంధ సంస్థల వల్ల దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని… వాటిని చర్చించడానికి ‘ నవ కల్పన చింతన్ శిబిర్’ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని… ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. దేశంలో మైనారిటీకు సమాన హక్కులు ఉన్నాయని.. అయితే బీజేపీ వారిని క్రూరంగా అణచివేస్తోందని ఆమె దుయ్యబట్టారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనలకు గురిచేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారని… దీని అర్థం ప్రజల్ని నిట్టనిలువునా చీల్చడం అంటూ విమర్శలు చేశారు.
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ప్రస్తుతం జరుగుతున్న చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పలు తీర్మానాలు చేయనుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్, యువతకు పెద్దపీట వేయడం, పార్టీలో అనేక సంస్కరణల గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతల గ్రూప్ జీ 23 చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. జీ 23 సూచించిన విధంగా పార్లమెంటరీ బోర్డ్ మెకానిజాన్ని మళ్లీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది.
- Tags
- bjp
- Chintan Shivir
- congress
- Rajastan
- RSS
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!