Sonia Gandhi: బీజేపీ గాంధీ హంతకులను ఆరాధిస్తోంది…మైనారిటీలను అణచివేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కీలక నేతలు ఉదయ్ పూర్ తరలివెళ్లారు. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన సూచనలు చేశారు.
ఇదిలా ఉంటే తొలి రోజే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ గాంధీ హంతకులను ఆరాధిస్తోందని.. మైనారిటీలను క్రూరంగా అణచివేస్తోందిని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటి అనుబంధ సంస్థల వల్ల దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని… వాటిని చర్చించడానికి ‘ నవ కల్పన చింతన్ శిబిర్’ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని… ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. దేశంలో మైనారిటీకు సమాన హక్కులు ఉన్నాయని.. అయితే బీజేపీ వారిని క్రూరంగా అణచివేస్తోందని ఆమె దుయ్యబట్టారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనలకు గురిచేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారని… దీని అర్థం ప్రజల్ని నిట్టనిలువునా చీల్చడం అంటూ విమర్శలు చేశారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
ప్రస్తుతం జరుగుతున్న చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పలు తీర్మానాలు చేయనుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్, యువతకు పెద్దపీట వేయడం, పార్టీలో అనేక సంస్కరణల గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతల గ్రూప్ జీ 23 చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. జీ 23 సూచించిన విధంగా పార్లమెంటరీ బోర్డ్ మెకానిజాన్ని మళ్లీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది.
- Tags
- bjp
- Chintan Shivir
- congress
- Rajastan
- RSS
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..