Mamata Banerjee: ‘‘కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయి.’’ దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడులకు ఢిల్లీ ముస్తాబైంది. అయితే, ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయని అన్నారు. శనివారం తృణమూల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి తమ పార్టీ హాజరుకాబోదని చెప్పారు.
‘‘400 సీట్ల గురించి మాట్లాడిన బీజేపీ, మెజారిటీ కూడా పొందలేకపోయిందని అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటే ఏమీ జరగదని అనుకోకండీ, ఎందుకంటే పరిస్తితులు మారుతూనే ఉంటాయి, మేం చూస్తుంటాం, కొన్ని రోజుల తర్వాత కొత్త ఇండియా ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులు వారు అధికారంలో ఉండనివ్వండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉన్నాయి. ఏదైనా జరగొచ్చు, ఎవరికి తెలుసు ఈ ప్రభుత్వం 15 రోజులే ఉంటుందేమో..?’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Fadnavis: వ్యూహం మార్చిన ఫడ్నవీస్.. మహా ఎన్నికలే టార్గెట్!
బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం (CAA)తో సహా కఠినమైన చట్టాలను రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలేమని, మళ్లీ వారు పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తారని, ప్రమాణస్వీకారానికి తమకు ఆహ్వానం అందలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్లోని 42 ఎంపీ సీట్లలో బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా.. టీఎంసీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో బీజేపీకి 18 రాగా, టీఎంసీకి 22 వచ్చాయి.
మొత్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను కైవసం చేసుకుంది. 2014, 2019లో రెండుసార్లు బీజేపీ స్వతహాగా మ్యాజిక్ ఫిగర్( 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272) స్థానాలను గెలుచుకుంది. ఈ సారి మెజారిటీకి దాదాపుగా 30 సీట్లు తక్కువగా వచ్చాయి. మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన మద్దతుతో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!