Doda attack terrorists: దోడా ఉగ్రదాడి నిందితుల స్కెచ్ విడుదల.. సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డ్..
- దోడా దాడికి పాల్పడిన టెర్రరిస్టుల స్కెచ్ విడుదల..
- సమాచారం ఇస్తే రూ. 5 లక్షల రివార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doda attack terrorists: ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా లోయ ప్రాంతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు కాశ్మీర్లో తమ ప్రాక్సీలను ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయి. జమ్మూ ప్రాంతంలోని రియాసి, కథువా, దోడా జిల్లాలు నియంత్రణ రేఖను ఆనుకుని ఉండటం, ఆ ప్రాంతంలో కొండలు లోయలు, అడవులు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నాయి.
Read Also: Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
గత వారం దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో కెప్టెన్తో సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. ఈ దాడిలో పాల్పడిన ఉగ్రవాదుల స్కెచ్లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల సమాచారం ఇస్తే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సీనియర్ పోలీస్ అధికారులు ప్రజలు చేరుకోవడానికి కంట్రోల్ రూపంతో సహా డజన్లకు పైగా మొబైల్ నెంబర్లు ఇచ్చారు.
జూలై 16న దోడా జిల్లాలో భారీ ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర మరియు సిపాయి అజయ్ నరుకా మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం)కి అనుబంధంగా ఉన్న ‘కాశ్మీర్ టైగర్స్’ అనే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వీరి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమతో పంచుకోవాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..