Doda attack terrorists: దోడా ఉగ్రదాడి నిందితుల స్కెచ్ విడుదల.. సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డ్..
- దోడా దాడికి పాల్పడిన టెర్రరిస్టుల స్కెచ్ విడుదల..
- సమాచారం ఇస్తే రూ. 5 లక్షల రివార్డ్..
Doda attack terrorists: ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా లోయ ప్రాంతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు కాశ్మీర్లో తమ ప్రాక్సీలను ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయి. జమ్మూ ప్రాంతంలోని రియాసి, కథువా, దోడా జిల్లాలు నియంత్రణ రేఖను ఆనుకుని ఉండటం, ఆ ప్రాంతంలో కొండలు లోయలు, అడవులు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నాయి.
Read Also: Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
గత వారం దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో కెప్టెన్తో సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. ఈ దాడిలో పాల్పడిన ఉగ్రవాదుల స్కెచ్లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల సమాచారం ఇస్తే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సీనియర్ పోలీస్ అధికారులు ప్రజలు చేరుకోవడానికి కంట్రోల్ రూపంతో సహా డజన్లకు పైగా మొబైల్ నెంబర్లు ఇచ్చారు.
జూలై 16న దోడా జిల్లాలో భారీ ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర మరియు సిపాయి అజయ్ నరుకా మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం)కి అనుబంధంగా ఉన్న ‘కాశ్మీర్ టైగర్స్’ అనే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వీరి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమతో పంచుకోవాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!