Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా హత్యలో కీలక సూత్రధారి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidhu Moose Wala assassination Mastermind Goldy Brar Detained In California: పంజాబీ సింగర్, పొలిటికల్ లీడర్ సిద్దూ మూసేవాలా హత్యలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను అమెరికాలో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అయిన గోల్డీ బ్రార్ మూసేవాలా హత్యలో మాస్టర్ మైండ్. ఇటీవల కెనడా నుంచి యూఎస్ఏకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాల్నిఫోర్నియాలో నవంబర్ 20న గోల్డీ బ్రార్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమచారం. ఈ మేరకు అమెరికా అధికారిక వర్గాలు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించాయి.
Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
మూసేవాలా హత్య తర్వాత బ్రార్, కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు శాక్రమెంటో, ఫ్రిజో, సాల్ట్ లేక్ సిటీల్లో నివాసం ఉంటూ వస్తున్నాడని సమాచారం. గోల్డీ బ్రార్ దొరికినట్లు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), సీబీఐ, పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ అరెస్ట్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించన తర్వాత గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన తండ్రి డిమాండ్ చేశాడు. ఒక వేళ కేంద్రం ఈ డబ్బు ఇవ్వలేకపోతే నేనే సొంతంగా డబ్బులు ఇస్తానని సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్కు చెందిన గోల్డీ బ్రార్ 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. గత నెలలో జరిగిన డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో కీలక సూత్రధారిగా కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మే 29న పంజాబ్ మాన్సాలోని తన ఇంటి నుంచి జీపులో బయటకు వచ్చిన సిద్దూ మూసేవాలాను, కాపు కాచి దుండగులు హత్య చేశారు. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సెలబ్రెటీలకు సెక్యురిటీ తగ్గించిన కొన్ని రోజుల్లోనే ఈ హత్య జరిగింది.
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!