Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా హత్యలో కీలక సూత్రధారి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidhu Moose Wala assassination Mastermind Goldy Brar Detained In California: పంజాబీ సింగర్, పొలిటికల్ లీడర్ సిద్దూ మూసేవాలా హత్యలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను అమెరికాలో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అయిన గోల్డీ బ్రార్ మూసేవాలా హత్యలో మాస్టర్ మైండ్. ఇటీవల కెనడా నుంచి యూఎస్ఏకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాల్నిఫోర్నియాలో నవంబర్ 20న గోల్డీ బ్రార్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమచారం. ఈ మేరకు అమెరికా అధికారిక వర్గాలు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించాయి.
Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
మూసేవాలా హత్య తర్వాత బ్రార్, కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు శాక్రమెంటో, ఫ్రిజో, సాల్ట్ లేక్ సిటీల్లో నివాసం ఉంటూ వస్తున్నాడని సమాచారం. గోల్డీ బ్రార్ దొరికినట్లు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), సీబీఐ, పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ అరెస్ట్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించన తర్వాత గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన తండ్రి డిమాండ్ చేశాడు. ఒక వేళ కేంద్రం ఈ డబ్బు ఇవ్వలేకపోతే నేనే సొంతంగా డబ్బులు ఇస్తానని సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్కు చెందిన గోల్డీ బ్రార్ 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. గత నెలలో జరిగిన డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో కీలక సూత్రధారిగా కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మే 29న పంజాబ్ మాన్సాలోని తన ఇంటి నుంచి జీపులో బయటకు వచ్చిన సిద్దూ మూసేవాలాను, కాపు కాచి దుండగులు హత్య చేశారు. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సెలబ్రెటీలకు సెక్యురిటీ తగ్గించిన కొన్ని రోజుల్లోనే ఈ హత్య జరిగింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!