Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ
- సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం
- క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెటా సంస్థ చంపేసింది. ఇటీవల ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూశారు. ఆమె మృతికి సంతాపం తెల్పుతూ సిద్ధరామయ్య కన్నడలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ను ఇంగ్లీషులోకి మెటా సంస్థ తప్పుగా అనువదించింది. సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువదించింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పింది. దీంతో మెటాకు సిద్ధరామయ్య ఘాటు లేఖ రాశారు. కన్నడ ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్లో ట్రంప్ పర్యటన వార్తలపై స్పందించిన వైట్హౌస్
Also Read
కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఫేస్బుక్లో నటి సరోజా దేవి మృతికి సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే ఈ సందేశాన్ని మెటో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించారని తప్పుగా అనువాదం చేసింది. దీంతో సిద్ధరామయ్య సర్కార్కు ఆగ్రహం తెప్పించింది. తక్షణమే మెటా టూల్ను తొలగించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Vizag: నేడు ఐఎన్ఎస్ నిస్తార్ నౌక జాతికి అంకితం
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం కోరింది. కచ్చితంగా నిర్ధారించేంత వరకు ఫీచర్ను మూసేయాలని కోరింది. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఇది చాలా ప్రమాదకరమని మీడియా సలహాదారు ప్రభాకర్ అధికారికంగా మెటాకు లేఖ రాశారు.
జరిగిన పొరపాటుపై మెటా సంస్థ క్షమాపణ చెప్పింది. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని కంపెనీ ఫేస్బుక్లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. సాంకేతికతను మెరుగుపరచడానికి నిరంతరం అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పింది.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!