BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
- మల్లికార్జున ఖర్గే ‘‘టెర్రరిస్ట్ పార్టీ’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ టెర్రరిస్టులకు మద్దతు ఇస్తుందని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. ‘‘వారు కొంత కాలం నిశ్శబ్దంగా ఉన్నారు. మళ్లీ హర్యానా విజయం తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. వారు మేధావులు, ప్రగతిశీల వ్యక్తుల్ని అర్బన్ నక్సల్స్గా పిలుస్తారు. వారు ప్రజల్ని కొట్టి చంపుతారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తుల నోటిలో మూత్ర విసర్జన చేస్తారు.’’ అని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
అయితే, ఖర్గే విమర్శలపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు, వేరేవారికి ఈ విషయాన్ని చెబుతున్నారు అని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. ప్రజల్ని అవమానించడమే కాంగ్రెస్ గుర్తింపు అని, 2014, 2019, 2024లో ప్రజలు బీజేపీకి ఓటేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ డీఎన్ఏని తెలియజేస్తాయని పూనావాలా అన్నారు. కాంగ్రెస్ దళితుల గురించి మాట్లాడుతోంది.. హర్యానాలో కుమారి సెల్జాకి వారు ఏం చేశారు అంతా చూశారని, కర్ణాటకలో దళితుల కోసం ఉద్దేశించిన నిధుల్ని దోచుకున్నారని విమర్శించారు.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, అవినీతిని ఏమాత్రం సహించని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే అని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో రాళ్లదాడిని అంతమొందించామని, ముంబైలాంటి టెర్రర్ అటాక్ ఎందుకు జరగలేదని కాంగ్రెస్ తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ యూపీఏ హయాంలో నిత్యం బాంబు పేలుళ్లు జరిగేవని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!