S Jaishankar: పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్..
- పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్..
- ఉగ్రవాదం..వేర్పాటువాదం..తీవ్రవాదంపై భారత వైఖరి స్పష్టం..
- ఈ మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్సీఓ సమ్మిట్లో పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
‘‘అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరం. చార్టర్ పేర్కొన్నట్లుగా మూడు చెడులను ఎదుర్కోవడంలో దృఢంగా, రాజీపడకుండా ఉండటం దీని అర్థం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఉన్నట్లైయితే వాణిజ్యం, ఎనర్జీ ఫ్లో, ప్రజల మధ్య పరస్పర మార్పిడి, కనెక్టవిటిని ప్రోత్సహించదు’’ అని జైశంకర్ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
Read Also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడం ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. గ్లోబలైజేషన్, రీబ్యాలెన్సింగ్ ప్రస్తుత వాస్తవాలని, ఎస్సీఓ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి నిజాయితీతో కూడిన చర్చలు, విశ్వాసం పునరుద్ఘాటించడం అవసరం. ఎస్సీఓ మూడు చెడులను ఎదుర్కోవడంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు.
సహకారం, పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గుర్తించి, నిజమైన భాగస్వామ్యాలను నిర్మించబడాలని, ఏకపక్ష ఎజెండాతో కాదు అని భారతదేశం ప్రకటనని ఎస్సీఓ సమ్మిట్లో జైశంకర్ చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి, సుస్థిర జీవనశైలిని సూచించే మిషన్ లైఫ్, యోగా, గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ అండ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ ప్రోమోషన్ వంటి సుస్థిరత మరియు సమగ్ర అభివృద్ధికి భారతదేశం యొక్క ప్రపంచ కార్యక్రమాలు, జాతీయ ప్రయత్నాలను జైశంకర్ హైలెట్ చేశారు.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!