Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..
- ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు దెబ్బతీసుకున్నారు..
- శివసేన ఉద్ధవ్ వర్గం విమర్శలు..
- సొంత పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు..
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Read Also: PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవడంతోనే బీజేపీ గెలిచిందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలే బీజేపీ గెలుపుకు కారణమయ్యాయని ఉద్ధవ్ ఠాక్రే శివసేన తెలిపింది. శివసేన-యూబీటీ మౌత్ పీస్ పత్రిక ‘‘సామ్నా’’లోని సంపాదకీయంలో.. ఆప్, కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీతో కాకుండా తమలో తాము పోరాడాయని, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాల మధ్య పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించింది.
‘‘ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి. దీని వలన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు పని సులభతరం అయింది. ఇది ఇలాగే కొనసాగితే పొత్తులు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి..? మీ మనసుకు నచ్చినంత వరకు పోరాడండి’’ అంటూ కఠినంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులే మహారాష్ట్రలో కూడా నిరాశను కలిగించాయని చెప్పింది. ఢిల్లీ ఎన్నికల నుంచి ప్రతిపక్షాలు గుణపాఠాలు నేర్చుకోకుంటే, మోడీ-షాల ‘‘నిరంకుశ పాలన’’ బలోపేతమవుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!