Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..
- ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు దెబ్బతీసుకున్నారు..
- శివసేన ఉద్ధవ్ వర్గం విమర్శలు..
- సొంత పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Read Also: PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవడంతోనే బీజేపీ గెలిచిందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలే బీజేపీ గెలుపుకు కారణమయ్యాయని ఉద్ధవ్ ఠాక్రే శివసేన తెలిపింది. శివసేన-యూబీటీ మౌత్ పీస్ పత్రిక ‘‘సామ్నా’’లోని సంపాదకీయంలో.. ఆప్, కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీతో కాకుండా తమలో తాము పోరాడాయని, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాల మధ్య పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించింది.
‘‘ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి. దీని వలన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు పని సులభతరం అయింది. ఇది ఇలాగే కొనసాగితే పొత్తులు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి..? మీ మనసుకు నచ్చినంత వరకు పోరాడండి’’ అంటూ కఠినంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులే మహారాష్ట్రలో కూడా నిరాశను కలిగించాయని చెప్పింది. ఢిల్లీ ఎన్నికల నుంచి ప్రతిపక్షాలు గుణపాఠాలు నేర్చుకోకుంటే, మోడీ-షాల ‘‘నిరంకుశ పాలన’’ బలోపేతమవుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..