Sanjay Raut: ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది.. ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది
- ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ అయితే ఘోరంగా చతికిలపడింది. ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జీరో సీట్లు సాధించింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Principal Slaps Teacher: టీచర్ను చెంప దెబ్బలతో వాయించేసిన ప్రిన్సిపాల్
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆప్, కాంగ్రెస్ బాధ్యత వహించాలని సూచించారు. మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం.. కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి.. అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉందని హితవు పలికారు. అలాగే ఆప్ కూడా బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే.. ఫలితాలు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే దీనిపై చర్చ జరగాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ గెలిచేది కాదు అన్నారు. ఇప్పుడు ఓటమికి ఆప్, కాంగ్రెస్ రెండూ కూడా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. అయినా ఇండియా కూటమిలో ఎవరికీ అహం ఉండకూడదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని సంజయ్ రౌత్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Singapore : పదివేల మంది భక్తులతో కలిసి హిందూ ఆలయంలో ప్రధాని పూజలు
గత శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 48, ఆప్కి 22 సీట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!