Sanjay Raut: ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది.. ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది
- ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ అయితే ఘోరంగా చతికిలపడింది. ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జీరో సీట్లు సాధించింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Principal Slaps Teacher: టీచర్ను చెంప దెబ్బలతో వాయించేసిన ప్రిన్సిపాల్
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆప్, కాంగ్రెస్ బాధ్యత వహించాలని సూచించారు. మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం.. కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి.. అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉందని హితవు పలికారు. అలాగే ఆప్ కూడా బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే.. ఫలితాలు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే దీనిపై చర్చ జరగాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ గెలిచేది కాదు అన్నారు. ఇప్పుడు ఓటమికి ఆప్, కాంగ్రెస్ రెండూ కూడా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. అయినా ఇండియా కూటమిలో ఎవరికీ అహం ఉండకూడదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని సంజయ్ రౌత్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Singapore : పదివేల మంది భక్తులతో కలిసి హిందూ ఆలయంలో ప్రధాని పూజలు
గత శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 48, ఆప్కి 22 సీట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!