Sanjay Raut: ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది.. ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఆ పొరపాటు వల్లే ఆప్ ఓడింది
- ఢిల్లీ ఫలితాలపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ అయితే ఘోరంగా చతికిలపడింది. ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జీరో సీట్లు సాధించింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Principal Slaps Teacher: టీచర్ను చెంప దెబ్బలతో వాయించేసిన ప్రిన్సిపాల్
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆప్, కాంగ్రెస్ బాధ్యత వహించాలని సూచించారు. మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం.. కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి.. అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉందని హితవు పలికారు. అలాగే ఆప్ కూడా బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే.. ఫలితాలు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే దీనిపై చర్చ జరగాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ గెలిచేది కాదు అన్నారు. ఇప్పుడు ఓటమికి ఆప్, కాంగ్రెస్ రెండూ కూడా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. అయినా ఇండియా కూటమిలో ఎవరికీ అహం ఉండకూడదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని సంజయ్ రౌత్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Singapore : పదివేల మంది భక్తులతో కలిసి హిందూ ఆలయంలో ప్రధాని పూజలు
గత శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 48, ఆప్కి 22 సీట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!