Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
- మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా..
- ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు..
- దేశాధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్..
- యూరప్లో ఆశ్రయం మరింత ఆలస్యం..
- ప్రధాని మోడీతో సమావేశం ఉండే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా స్వల్పకాలి, దీర్ఘకాలిక ఆశ్రయం కోసం భారత భద్రతా సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆమెకు ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఎక్కువ కాలంలో దేశంలోనే ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు.. ఢిల్లీలో చర్చలు..
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
77 ఏళ్ల మాజీ ప్రధానికి యూరోపియన్ దేశాలు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రధాని మోడీతో కూడామ ఆమె సమావేశం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. షేక్ హసీనా బస గురించి, యూరోపియన్ దేశాల్లో ఆమె ఆశ్రయం గురించి ఎప్పటికప్పుడు దోవల్ ప్రధాని మోడీకి అప్డేట్స్ అందిస్తున్నారు.
ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్లోని ఆమెకు బస ఏర్పాటు చేశారు. త్వరలోనే విశాలమైన, సురక్షితమైన ప్రదేశానికి మార్చబడుతుందని తెలుస్తోంది. భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్నే షేక్ హసీనాకు ఇస్తోంది. షేక్ హసీనా బస కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లను పరిగణలోకి తీసుకుని వైమానిక దళం, భద్రతా సంస్థలు ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి సఫ్దర్ జంగ్, పాలం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి. ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలను మోహరించినట్లు, వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు హిండన్ ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!