Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
- మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా..
- ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు..
- దేశాధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్..
- యూరప్లో ఆశ్రయం మరింత ఆలస్యం..
- ప్రధాని మోడీతో సమావేశం ఉండే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా స్వల్పకాలి, దీర్ఘకాలిక ఆశ్రయం కోసం భారత భద్రతా సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆమెకు ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఎక్కువ కాలంలో దేశంలోనే ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు.. ఢిల్లీలో చర్చలు..
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
77 ఏళ్ల మాజీ ప్రధానికి యూరోపియన్ దేశాలు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రధాని మోడీతో కూడామ ఆమె సమావేశం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. షేక్ హసీనా బస గురించి, యూరోపియన్ దేశాల్లో ఆమె ఆశ్రయం గురించి ఎప్పటికప్పుడు దోవల్ ప్రధాని మోడీకి అప్డేట్స్ అందిస్తున్నారు.
ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్లోని ఆమెకు బస ఏర్పాటు చేశారు. త్వరలోనే విశాలమైన, సురక్షితమైన ప్రదేశానికి మార్చబడుతుందని తెలుస్తోంది. భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్నే షేక్ హసీనాకు ఇస్తోంది. షేక్ హసీనా బస కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లను పరిగణలోకి తీసుకుని వైమానిక దళం, భద్రతా సంస్థలు ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి సఫ్దర్ జంగ్, పాలం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి. ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలను మోహరించినట్లు, వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు హిండన్ ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!