Tamil Nadu: కొడుకు చదువు కోసం చావుకు సిద్ధమైంది..
Tamil Nadu: కొడుకును ఉన్నత చదువు చదివించడం కోసం ఆ మహిళ చావుకు సిద్ధమైంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు పరిహారం కోసం బస్సు ముందుకు దూకిన ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఒక మహిళ, తన కొడుకు భవిష్యత్తు కోసం తమిళనాడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం కదులుతున్న బస్సు ముందు దూకింది. జూన్ 28న ఈ ఘటన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు
Also Read
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
జూన్ 28న సేలంలో 45 సంవత్సరాల వయస్సు గల పాపాతి తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడం కోసం స్పీడ్గా వెళుతున్న బస్సు కింద పడి మరణించారు. ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం వస్తుందని ఎవరో చెప్పడంతో .. ఆ మహిళ ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడట్టు తెలుస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన సమయం కంటే ముందు పాపాతి బస్సు ముందు దూకడానికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అయితే ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపటి తర్వాత.. ఆమె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ మరొక బస్సు ముందు దూకడం కనిపించిందని.. ఫలితంగా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక పాపాతి డిప్రెషన్తో పోరాడుతోందని బంధువులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించడంతో పాపాతి ఈ దుశ్చర్యకు పాల్పడింది. భర్త నుంచి విడిపోయిన పాపాతి.. గత 15 ఏళ్లుగా తన పిల్లలను తానే ఒంటరిగా పెంచుతోంది.
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!