DK Shivakumar: శశిథరూర్, తాజాగా డీకే శివకుమార్.. కాంగ్రెస్లో కలకలం..
- కాంగ్రెస్లో డీకే శివకుమార్ కలకలం..
- బీజేపీకి దగ్గరవుతున్నరంటూ సొంత పార్టీలోనే ప్రచారం..
- మహాశివరాత్రి, కుంభమేళాకి హాజరుకావడంతో వివాదం..
- ఇప్పటికే శశిథరూర్ వ్యవహారంతో కాంగ్రెస్లో అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది.
ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ ఎక్స్లో శివకుమార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన చర్య పార్టీ మూలాలను దెబ్బతీస్తుందని అని అన్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో , శివకుమార్ వేదికను పంచుకున్నారు. మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. పీవీ మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వంటి లౌకిక పార్టీగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీని ఎగతాళి చేసే వ్యక్తికి మీరు ఎలా థాంక్స్ చెప్పగలరు అని శివకుమార్ని ప్రశ్నించారు.
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
Read Also: Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..
కర్ణాటకలో సిద్ధరామయ్యతో అధికార పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారనే సందేశం ఇస్తున్నారంటూ పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఊహాగానాలను డీకే శివకుమార్ కొట్టివేశారు. తాను హిందువునని, అదే సమయంలో కాంగ్రెస్వాదిని అని చెప్పారు.
మరోవైపు తిరువననంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ వ్యవహారం కూడా కాంగ్రెస్ని భయపెడుతోంది. తాజాగా ఓ టీవీ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీకి నా అవసరం లేకుంటే, తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు, ట్రంప్తో మోడీ భేటీ కావడాన్ని ప్రశంసించారు. కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వంపై థరూర్ పొగడ్తలు కురిపించడం కూడా కాంగ్రెస్లో ఆగ్రహానికి కారణమైంది.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!