DK Shivakumar: శశిథరూర్, తాజాగా డీకే శివకుమార్.. కాంగ్రెస్లో కలకలం..
- కాంగ్రెస్లో డీకే శివకుమార్ కలకలం..
- బీజేపీకి దగ్గరవుతున్నరంటూ సొంత పార్టీలోనే ప్రచారం..
- మహాశివరాత్రి, కుంభమేళాకి హాజరుకావడంతో వివాదం..
- ఇప్పటికే శశిథరూర్ వ్యవహారంతో కాంగ్రెస్లో అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది.
ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ ఎక్స్లో శివకుమార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన చర్య పార్టీ మూలాలను దెబ్బతీస్తుందని అని అన్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో , శివకుమార్ వేదికను పంచుకున్నారు. మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. పీవీ మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వంటి లౌకిక పార్టీగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీని ఎగతాళి చేసే వ్యక్తికి మీరు ఎలా థాంక్స్ చెప్పగలరు అని శివకుమార్ని ప్రశ్నించారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..
కర్ణాటకలో సిద్ధరామయ్యతో అధికార పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారనే సందేశం ఇస్తున్నారంటూ పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఊహాగానాలను డీకే శివకుమార్ కొట్టివేశారు. తాను హిందువునని, అదే సమయంలో కాంగ్రెస్వాదిని అని చెప్పారు.
మరోవైపు తిరువననంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ వ్యవహారం కూడా కాంగ్రెస్ని భయపెడుతోంది. తాజాగా ఓ టీవీ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీకి నా అవసరం లేకుంటే, తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు, ట్రంప్తో మోడీ భేటీ కావడాన్ని ప్రశంసించారు. కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వంపై థరూర్ పొగడ్తలు కురిపించడం కూడా కాంగ్రెస్లో ఆగ్రహానికి కారణమైంది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?