Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..
- సంచలనంగా మారిన పూణే రేప్ కేసు..
- నిందితుడి కోసం చెరకు తోటల్లో పోలీసుల వేట..
- బస్లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్స్టాండ్లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.
ఇదిలా ఉంటే, అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పోలీసులు 08 టీములు ఏర్పాటు చేశారు. పూణేకి చెందిన వ్యక్తి తన స్వస్థలానికి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కున్నట్లు పోలీసులు అనుమతిస్తున్నారు. చెరకు తోటలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను మోరించారు. చెరకు తోట దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది కాబట్టి, నిందితుడిని వెతికేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు.
Also Read
నిందితుడు కూరగాయలు తీసుకెళ్లిన ట్రక్కులో దాక్కుని నగరం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్వస్థలానికి చేరుకుని తన బట్టలు, బూట్లను మార్చుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్కి చెందిన 8 టీమ్లతో సహా మొత్తం 13 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో, తెలిసిన వ్యక్తులతో మాట్లాడారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 1 లక్ష బహుమతి ప్రకటించారు.
ఈ రోజు తెల్లవారుజామున హోం శాఖ సహాయమంత్రి యోగేష్ కదమ్ మాట్లాడుతూ.. నిందితుడు గాడే ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని కనుగొన్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. నిందితుడిని వదిలిపెట్టబోమని అన్నారు. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ చేసిన ‘‘మరణ శిక్ష’’ వ్యాఖ్యలకు షిండే మద్దతు తెలిపారు.
Read Also: Joe Root: ఓటమి అంటే ఆ మాత్రం బాధ ఉంటది! స్టేడియంలోనే ఏడ్చేసిన జో రూట్
ఏం జరిగింది..?
మంగళవారం ఉదయం 5.45 నుంచి 6 గంటల ప్రాంతంలో పూణేలో అతిపెద్ద బస్టాండ్గా ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. సతారా జిల్లాలోని స్వస్థలానికి వెళ్లేందుకు బస్సుకోసం ఎదురుచూస్తున్న సమయంలో, నిందితుడు బస్సు వెళ్తుందని చెప్పి, ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. సీసీ కెమెరాలో నిందితుడు, మహిళతో మాట్లాడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముందుగా బస్సులో లైట్లు లేకపోవడంతో సందేహించిన మహిళకు.. ప్రయాణికులు పడుకున్నారని, అందుకే లైట్లు ఆపేశానని మాయ మాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి, డోర్లు మూసేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 36 ఏళ్ల నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!