Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
- మోడీపై శశి థరూర్ ప్రశంసలు..
- భారత నావికుల రక్షణను ట్రంప్ ముందు ప్రస్తావించారన్న ఎంపీ..
- ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితులు..
- రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో, భారత నావికుల భద్రతా అంశాన్ని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని థరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది.
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లో మోడీ-ట్రంప్ సమావేశం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తు్న్న భారత నావికుల భద్రతపై మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్లు థరూర్ అన్నారు. యుద్ధ పరిస్థితుల్లో నావికులను టార్గెట్ చేయడం సరికాదని మోడీ స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘ నావికులు సైనికులు కారు. యుద్ధ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకోవద్దని మోడీ ట్రంప్కు చెప్పారు’’ అని థరూర్ అన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దాడి వల్ల ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అయితే, ఈ ఘటనపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. థరూర్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వైఖరిని బహిర్గతం చేశాయని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో మోడీ ముందుంటారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని ఫైర్ అయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత, ఫ్రాన్స్ జీ7 సదస్సు వేదికగా ట్రంప్, మోడీ భేటీ అయ్యారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం గురించి ప్రస్తావించారు. నావికుల భద్రతను ట్రంప్ ముందు మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!