Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదుల్లో భయం పట్టింది. 45 రోజలు వ్యవధిలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. దీంతో మిగతా ఖలిస్తానీ వేర్పాటువాదులు గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఖలిస్తానీల్లో కీలకమైన గురుపత్వంత్ సింగ్ పన్నూ గత కొంతకాలంగా కనిపించడం లేదు. బ్రిటన్, యూఎస్, కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదానికి సహకరిస్తున్న పన్నూ..భారత విద్వేషాన్ని నరనరాల నింపుకున్నారు. ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థ పేరుతో భారత్ లో విద్వేషాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాడు. 2020లో భారత ప్రభుత్వం ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.
Read Also: PM Modi: మోడీ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కోసం క్యూ కట్టిన యూఎస్ చట్టసభ సభ్యులు
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
గతంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చాడు. ఏప్రిల్ నెలలో ప్రధాని ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు ముందు పన్నూ ప్రధానిని బెదిరిస్తూ అస్సాం జర్నలిస్టులకు ఆడియో సందేశాన్ని పంపాడు. దీంతో అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చాలా సార్లు పంజాబ్ ను భారత్ నుంచి విడగొడతామని ప్రగల్భాలు పలికాడు. అయితే గత కొంత కాలంగా ఆయన మిస్సింగ్. అతని ఆచూకీ లభించడం లేదు.
45 రోజుల్లో ముగ్గుర కీలక ఖలిస్తానీ ఉగ్రవాదలు అనుమానాస్పదంగా మరణించారు. ఈ వారంలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (45)ని కెనడాలోని సర్రే పట్టణంలో గురుద్వారాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. అంతకుముందు బ్రిటన్ లో భారతరాయబార కార్యాలయంపై దాడికి పాల్పడిన అవతార్ సింగ్ ఖాండా అనే ఉగ్రవాది అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఈ ఘటనకు ముందు పాకిస్తాన్ లాహోర్ లో ఉంటున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కీలక నేత, వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది పరమ్జిత్ సింగ్ పంజ్వార్ (63)ను మే 6న లాహోర్లో గుర్తు తెలియని సాయుధుడు కాల్చిచంపాడు. దీంతో వరస ఘటనల నేపథ్యంలో పలువురు కీలక నేతలు అండర్ గ్రౌండ్ కు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనేది ఇంకా వీడని ప్రశ్నగా ఉంది. అయితే పలువురు ఖలిస్తానీవాదులు మాత్రం ఈ హత్యల వెనక భారత్ ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!