NSAB: కేంద్రం సంచలన నిర్ణయం.. “జాతీయ భద్రతా సలహా బోర్డు” పునరుద్ధరణ..
- పహల్గామ్ దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం..
- "జాతీయ భద్రతా సలహా బోర్డు" పునరుద్ధరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Security Advisory Board: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘జాతీయ భద్రతా సలహా బోర్డు’’(National Security Advisory Board)ని పునరుద్ధరించింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అలోక్ జోషి దీనికి ఛైర్మన్గా నియమితులయ్యారు. గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AW’’ కి గతంలో జోషి చీఫ్గా పనిచేశారు. సాయుధ దళాలు, పోలీస్ సర్వీస్, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అయిన అధికారులతో కూడి ఏడుగురు సభ్యులు బోర్డుకు నాయకత్వం వహిస్తారు.
Read Also: Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
గతంలో సైనిక సేవల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ PM సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ AK సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా బోర్డులో భాగంగా ఉన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) నుండి ఇద్దరు రిటైర్డ్ అధికారులు – రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుండి రిటైర్డ్ అధికారి B వెంకటేష్ వర్మ బోర్డులో భాగం కాననున్నారు.
ఇటీవల, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు టూరిస్టులను కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడిలో పాకిస్తాన ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో భారత్, పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుతున్నారు. దీంతో, ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రం మొత్తం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ జీవనాడి ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులు వీసాలు రద్దు చేసింది. సైనిక చర్యకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!