New Delhi: వీర్యం తారుమారులో రూ. 1.50 కోట్ల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే వారిని కదలిస్తే చాలు.. వారి బాధలను చెప్పుకుంటూ పోతూనే ఉంటారు.. అన్ని ఉంటాయి వారి బాధలు. ప్రైవేటు ఆసుపత్రులు చేసే చికిత్స కంటే.. వేసే బిల్లే ఎక్కువగా ఉంటుంది. ఆ బిల్లును చూసిన రోగులకు, రోగి కుటుంబీకులకు కొత్త రోగాలు వస్తున్నాయి. అలాంటిదే న్యూఢిల్లీలో ఒక ఘటన జరిగింది. వీర్యంను తారు మారు చేశారు. దీంతో బాధితులు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. దీంతో కేసు విచారించిన కమిషన్ వీర్యం తారు మారు చేసిన ప్రైవేటు హాస్సిటల్కు ఏకంగా రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
Read also: Puvvada Ajay Kumar: పక్క రాష్ట్రాల్లో ఆర్టీసి పరిస్థితి బాగోలేదు..!
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించారు. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దపంతులు ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత 2009 జూన్లో వారికి కవల పిల్లలు జన్మించారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్టు స్పష్టమయింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ వారు ఎన్పీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ, దర్యాప్తు అనంతరం వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ. 1.50 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవటు ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రిలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎన్పీడీఆర్ కమిషన్ అభిప్రాయ పడింది.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..