Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
- ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి
- ప్రజలకు మనీష్ సిసోడియా విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. కొత్త పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. మరోసారి అధికారం కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రజల నుంచి సాయం కోరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హస్తినలోని జంగ్పుర అసెంబ్లీ స్థానం నుంచి సిసోడియా బరిలోకి దిగుతున్నారు. అయితే పోటీలో గెలిచేందుకు ఆర్థిక సాయం కోసం ప్రజల మద్దతు కోరారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాంను ప్రారంభించారు. తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్నికల బరిలోకి దిగాను. ఇప్పటి దాకా మీ మద్దతుతో గెలిచా. మీరు అందించే సాయంతో ఢిల్లీలో ఉద్యోగం, విద్యా పురోగతికి ఉపయోగపడుతుంది.’’ అని సిసోడియా పేర్కొన్నారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది జైలుకెళ్లారు. 17 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. అయితే ప్రస్తుతం పట్పర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల యూపీఎస్సీ కోచింగ్ నిపుణుడు అవధ్ ఓజా ఆప్లో చేరాడు. దీంతో పట్పర్గంజ్ నియోజకవర్గాన్ని అవధ్ ఓజాకు త్యాగం చేశారు. దీంతో సిసోడియా జంగ్పుర స్థానానికి మారారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!