Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
- ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి
- ప్రజలకు మనీష్ సిసోడియా విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. కొత్త పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. మరోసారి అధికారం కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రజల నుంచి సాయం కోరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హస్తినలోని జంగ్పుర అసెంబ్లీ స్థానం నుంచి సిసోడియా బరిలోకి దిగుతున్నారు. అయితే పోటీలో గెలిచేందుకు ఆర్థిక సాయం కోసం ప్రజల మద్దతు కోరారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాంను ప్రారంభించారు. తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్నికల బరిలోకి దిగాను. ఇప్పటి దాకా మీ మద్దతుతో గెలిచా. మీరు అందించే సాయంతో ఢిల్లీలో ఉద్యోగం, విద్యా పురోగతికి ఉపయోగపడుతుంది.’’ అని సిసోడియా పేర్కొన్నారు.
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది జైలుకెళ్లారు. 17 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. అయితే ప్రస్తుతం పట్పర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల యూపీఎస్సీ కోచింగ్ నిపుణుడు అవధ్ ఓజా ఆప్లో చేరాడు. దీంతో పట్పర్గంజ్ నియోజకవర్గాన్ని అవధ్ ఓజాకు త్యాగం చేశారు. దీంతో సిసోడియా జంగ్పుర స్థానానికి మారారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..