PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్నసెబీ చైర్మన్ మాధబి
- నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్పర్సన్ మాధబి..
- కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో విచారణ..
- ఈ మాధబిని దర్యాప్తు చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAC-SEBI: సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ ఈరోజు (గురువారం) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ చేసింది. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పీఏసీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యులు ఆరోపణలు చేశారు. కాగా, పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పని తీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.
Read Also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి అవకతవకలు కనిపించలేదని పేర్కొన్నట్లు సమాచారం. సెబీ చీఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. సెబీ చీఫ్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన విచారణ ముగిసింది. అయితే, మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, సెబీచీఫ్ పదవికీ మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
కాగా, అదానీ గ్రూప్నకు చెందిన ఆఫ్షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్బర్గ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారిపోయింది. దీంతో సెబీ ఛైర్పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని.. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం కూడా అందుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్తో సెబీకి సంబంధాలున్నాయని విమర్శలు గుప్పించింది. అయితే, ఆరోపణలను మాధబి తోసిపుచ్చింది. తమ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!