మళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొదట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలే అనే విధంగా తయారైంది పరిస్థితి.. దీంతో.. విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అయితే, ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్పటికే మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తిరిగి ప్రారంభవుతాయని వెల్లడించారు.. అంతేకాదు.. సీఎం ఉద్ధవ్ థాకరే కూడా తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు మంత్రి గైక్వాడ్.
కాగా, ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, మరోవైపు డెల్టా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తూ కల్లోలమే సృష్టిస్తున్నాయి.. దీంతో.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.. కానీ, కొన్ని వర్గాల నుంచి స్కూళ్లను ఓపెన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోందని చెబుతున్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్.. దీనిపై నిపుణులతో చర్చించి ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని.. మొదటగా కోవిడ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు.. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!