Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia has started construction of a 170 km megacity: సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.
2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది సౌదీ అరేబియా. పలువురు ఆర్కిటెక్చర్లు, ఆర్థికవేత్తలు దీని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ మెగాసిటీ పనులు ప్రారంభం అయ్యాయి. ఫ్లయింగ్ టాక్సీలు, రోబోట్స్ ఉపయోగం, గ్రీన్ ఎనర్జీ, ఏఐ మొదలైనవి ఈ సిటీలో ఉపయోగించనున్నారు. పూర్తిగా అద్దంతో కప్పబడిన స్కై లైన్స్ ను సమాంతరంగా 170 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీని వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే. సముద్ర మట్టానికి 500 ఎత్తులో ఈ నిర్మాణాన్ని నిర్మిస్తోంది.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read Also: Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. పవన, సౌర, హైడ్రోజన్ శక్తితో సహా అన్ని రకాల పునరుత్పాదక శక్తితో ఈ మెగాసిటీ నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలో పూర్తిగా నడిచే మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కబోతోంది. ప్రకృతితో సహజీవనం చేసే విధంగా.. పూర్తిగా పునరుత్పాదక శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సౌదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ది లైన్ ప్రాజెక్టులో రోడ్లు, కార్లు ఏం ఉండవు. ఇది 100 శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. 95 శాతం భూభాగం ప్రకృతి కోసం వినియోగించనున్నారు. సంప్రదాయ నగరాల మాదిరి కాకుండా..ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూఏఈ, సౌదీ వంటి దేశాలు మెగా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాలు పూర్తిగా చమురుపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా.. ఏదో రోజు ఈ నిల్వలు అడుగంటి పోతాయని తెలిసే ఈ దేశాలు పర్యాటక రంగం, స్థిరాస్తి రంగాలక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బుర్జ్ ఖలీపా, పామ్ ఐలాండ్స్ వంటి మెగా ప్రాజెక్టును తీసుకువచ్చింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది.
The Line project 🇸🇦#NEOM#vision_2030 pic.twitter.com/kWtjhxIHuu
— جلوي آل رشيد 🇸🇦 (@Alyami2030P) October 16, 2022
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!