Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia has started construction of a 170 km megacity: సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.
2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది సౌదీ అరేబియా. పలువురు ఆర్కిటెక్చర్లు, ఆర్థికవేత్తలు దీని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ మెగాసిటీ పనులు ప్రారంభం అయ్యాయి. ఫ్లయింగ్ టాక్సీలు, రోబోట్స్ ఉపయోగం, గ్రీన్ ఎనర్జీ, ఏఐ మొదలైనవి ఈ సిటీలో ఉపయోగించనున్నారు. పూర్తిగా అద్దంతో కప్పబడిన స్కై లైన్స్ ను సమాంతరంగా 170 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీని వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే. సముద్ర మట్టానికి 500 ఎత్తులో ఈ నిర్మాణాన్ని నిర్మిస్తోంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. పవన, సౌర, హైడ్రోజన్ శక్తితో సహా అన్ని రకాల పునరుత్పాదక శక్తితో ఈ మెగాసిటీ నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలో పూర్తిగా నడిచే మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కబోతోంది. ప్రకృతితో సహజీవనం చేసే విధంగా.. పూర్తిగా పునరుత్పాదక శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సౌదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ది లైన్ ప్రాజెక్టులో రోడ్లు, కార్లు ఏం ఉండవు. ఇది 100 శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. 95 శాతం భూభాగం ప్రకృతి కోసం వినియోగించనున్నారు. సంప్రదాయ నగరాల మాదిరి కాకుండా..ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూఏఈ, సౌదీ వంటి దేశాలు మెగా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాలు పూర్తిగా చమురుపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా.. ఏదో రోజు ఈ నిల్వలు అడుగంటి పోతాయని తెలిసే ఈ దేశాలు పర్యాటక రంగం, స్థిరాస్తి రంగాలక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బుర్జ్ ఖలీపా, పామ్ ఐలాండ్స్ వంటి మెగా ప్రాజెక్టును తీసుకువచ్చింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది.
The Line project 🇸🇦#NEOM#vision_2030 pic.twitter.com/kWtjhxIHuu
— جلوي آل رشيد 🇸🇦 (@Alyami2030P) October 16, 2022
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!