Kolkata Doctor Case: ట్రైనీ వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్ .. కీలక విషయం వెల్లడి..
- కోల్కతా వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్..
- సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారం చేసి హత్య చేశాడు..
- గ్యాంగ్ రేప్ ఆరోపణల్ని కొట్టిపారేసిన సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్పై సామూహిక అత్యాచార ఆరోపణల్ని సీబీఐ కొట్టిపారేసింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల విచారణ తర్వాత సీబీఐ ఈ రోజు మధ్యాహ్నం సీల్దా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో రాయ్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఛార్జిషీట్ దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది.
Read Also: Eye Color Change : మీరు మీ కంటి రంగును మార్చవచ్చు.. కానీ.. ఈ చికిత్సలో సక్సెస్ రేట్ తక్కువే..!
Also Read
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
ఆగస్టు 09న వైద్యురాలు చనిపోయినట్లు పరిశోధనలలో తేలింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో కోల్కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఆగస్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ప్రభుత్వమే నిందితుడికి రక్షణగా నిలుస్తోందని ప్రజలు ఆరోపించారు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. మెడికల్ కాలేజీ సెమినార్ హాలులో సంజయ్ రాయ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో మెడికల్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. బాధితురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకపోగా, మృతదేహాన్ని చూసేందుకు మూడు గంటల పాటు అనుమతించలేదు. ఈ కేసులో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరుపై కూడా అనుమానాలు వచ్చాయి. అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను కూడా ఆర్థిక అవకతవకలు, సాక్ష్యాలను తారుమారు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు సీబీఐ అరెస్టు చేశాయి.
తాజావార్తలు
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!