RG Kar rape case: జైల్లో సంజయ్ రాయ్ కొత్త కోరిక.. ఏం అడిగాడంటే..!
- జైల్లో సంజయ్ రాయ్ కొత్త కోరిక
- పెన్, నోట్బుక్ ఇవ్వాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్కి ఇటీవల కోర్టు జీవితఖైదు విధించింది. ఆగస్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇప్పటి దాకా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సంజయ్ రాయ్కి శిక్ష పడడంతో ఇకపై జైల్లో పని చేయాల్సి ఉంటుంది. పనుల్లో నైపుణ్యం లేని వాడు కాబట్టి అతనికి రోజుకి రూ.105తో కూడిన ఉద్యోగం ఇవ్వబడుతుందని జైలు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ రాయ్ జైలు అధికారులను ఒక కోరిక కోరాడు. తనకు పెన్, నోట్బుక్ ఇవ్వాలని అభ్యర్థించాడు. ఇక సంజయ్ రాయ్కి ప్రస్తుతం ఐదు దుప్పట్లు ఉన్నాయి. మరో మూడు అదనంగా కావాలని కోరాడు. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక సెల్లో నడవడం, వ్యాయామం చేసుకునే వెసులబాటు ఉంది.
ఇది కూడా చదవండి: Hyderabad: గాంధీభవన్లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
సంజయ్ రాయ్ ఆగష్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ జైల్లో ఉంటున్నాడు. వర్చువల్ లేదా ఫిజికల్గా కోర్టులో హాజరుపరిచే సమయంలో తప్ప మిగతా సమయంలో ఎప్పుడూ సెల్లోనే తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఖైదీలు తోటపని, వస్త్రాలు, ఫర్నిచర్, పఫ్డ్ రైస్, అల్యూమినియం పాత్రల తయారీ వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.105, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.120, నైపుణ్యం కలిగిన కార్మికులు రూ.135 రోజువారీ వేతనం ఇస్తుంటారు. వేతనం.. ఖైదీ ఖాతాలో జమ అవుతుంటాయి. ఆ నగదు.. జైల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించొచ్చు. ఒకవేళ విడుదలైనప్పుడు డబ్బు తీసుకుని వెళ్లొచ్చు. సంజయ్ రాయ్ తోటపనిలో పాల్గొనవచ్చని సమాచారం.
ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
తాజావార్తలు
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!