Anantnag Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్లో తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్కౌంటర్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్ అక్కడికక్కడే మరణించగా.. మేజర్ అశిష్ ధోనాక్, డీఎస్పీ హిమయూన్ భట్ తీవ్రగాయాలతో మరణించారు. ఒక జవాన్ మరణించగా, మరో జవాన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇంత పెద్ద సంఖ్యలో, ముఖ్యమైన హై ర్యాంక్ అధికారులు మరణించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. దీంతో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరణించే కొన్ని గంటల ముందు ఆర్మీ అధికారి మాట్లాడిన మాటలను తలుచుకుంటూ వారి కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. బుధవారం ఉదయం 6.45 గంటలకు కల్నల్ మన్ప్రీత్ సింగ్ చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మళ్లీ తర్వాత ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ లో ఆయన మరణించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సింగ్ బావమరిది వీరేందర్ గిల్ కన్నీరుమున్నీరయ్యారు. 41 ఏళ్ల మన్ ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి.
Also Read
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
Read Also: Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు
మేజర్ అశిష్ ధోనక్(34)కి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. వీరు హర్యానా పానిపట్ లో నివసిస్తున్నారు. చివరిసారిగా వీరితో టెలిఫోన్ లో మాట్లాడారు. ఒకటిన్నర నెలల క్రితం ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఇళ్లు మారడానికి అక్టోబర్ నెలలో తిరిగిరావాల్స ఉందని ధోనక్ మామయ్య చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో డీఎస్పీగా పనిచేస్తున్న హిమాయున్ భట్, రిటైర్డ్ ఇన్పెక్టర్ జనరల్ గులాం హసన్ భట్ కుమారుడు. భట్ కి నెల క్రితమే కొడుకు పుట్టాడు. హియాయున్ భట్ అంత్యక్రియలు బుద్గాంలో జరిగాయి. కన్నీటిని దిగమింగుకుంటూ ఆయన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులు అర్పించారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అనంత్ నాగ్ ప్రాంతంలో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!