Sachin Pilot: బీజేపీ నేతలకు సచిన్ పైలట్ కౌంటర్.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Pilot: మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ తనయుడు.. సచిన్ పైలట్ తన తండ్రిపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా మట్డాడకండి.. ప్రజలకు చెప్పే టప్పుడు వాస్తవంగా ఏమీ జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి బాంబ్లు వేసింది సొంత ప్రజలపై కాదని.. భారత్- పాకిస్థాన్ యుద్ధ సమయంలో అని.. అది కూడా బీజేపీ వారు చెప్పిన తేదిల్లో కాదని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సచిన్ పైలట్ ట్విట్టర్ లో పోస్టులో చేశారు.
Read also: Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్విట్టర్లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ మరియు సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ 1966, మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్లో బాంబు దాడి జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సీరియస్గా స్పందించారు. మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్లో “1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో మిజోరాం రాజధాని ఐజ్వాల్పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది” అని ట్విట్టర్లో పోస్టు చేశారు అమిత్ మాలవ్య. అమిత్ మాలవ్య పోస్టుకు సచిన్ పైలట్ బదులిస్తూ.. “మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అని.. అదికూడా 1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా బాంబులు వేశారని స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదన్నారు. మా నాన్న 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.” అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో జాయిన్ అయిన జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును ట్విట్టర్లో పోస్టు చేశారు.
.@amitmalviya – You have the wrong dates, wrong facts…
Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB— Sachin Pilot (@SachinPilot) August 15, 2023
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..