Sachin Pilot: బీజేపీ నేతలకు సచిన్ పైలట్ కౌంటర్.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్
Sachin Pilot: మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ తనయుడు.. సచిన్ పైలట్ తన తండ్రిపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా మట్డాడకండి.. ప్రజలకు చెప్పే టప్పుడు వాస్తవంగా ఏమీ జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి బాంబ్లు వేసింది సొంత ప్రజలపై కాదని.. భారత్- పాకిస్థాన్ యుద్ధ సమయంలో అని.. అది కూడా బీజేపీ వారు చెప్పిన తేదిల్లో కాదని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సచిన్ పైలట్ ట్విట్టర్ లో పోస్టులో చేశారు.
Read also: Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.
Also Read
- PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్విట్టర్లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ మరియు సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ 1966, మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్లో బాంబు దాడి జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సీరియస్గా స్పందించారు. మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్లో “1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో మిజోరాం రాజధాని ఐజ్వాల్పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది” అని ట్విట్టర్లో పోస్టు చేశారు అమిత్ మాలవ్య. అమిత్ మాలవ్య పోస్టుకు సచిన్ పైలట్ బదులిస్తూ.. “మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అని.. అదికూడా 1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా బాంబులు వేశారని స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదన్నారు. మా నాన్న 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.” అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో జాయిన్ అయిన జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును ట్విట్టర్లో పోస్టు చేశారు.
.@amitmalviya – You have the wrong dates, wrong facts…
Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB— Sachin Pilot (@SachinPilot) August 15, 2023
తాజావార్తలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!