S Jaishankar: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్పింగ్ను కలిసిన జైశంకర్..
- గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్పింగ్ను కలిసిన జైశంకర్..
- ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం చైనా పర్యటన..
- సంబంధాల సాధారణీకరణకు రెండు దేశాల కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు.
Read Also: Lokesh : నాగ్ సార్ని ఒప్పించడం చాలా కష్టం.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ స్టేట్మెంట్!
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
‘‘ఈ రోజు ఉదయం బీజింగ్లో అధ్యక్షుడు జి జిన్పింగ్ను నా సహ SCO విదేశాంగ మంత్రులతో కలిసి కలిశాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశాను. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అభివృద్ధి గురించి అధ్యక్షుడు జిన్పింగ్కు వివరించాను. ’’ అని ట్వీట్ చేశారు.
జూన్ 2020లో జరిగిన ఘోరమైన గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది మొదటి సమావేశం. అక్టోబర్ 2024లో సరిహద్దుల్లో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమ్చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చా విధానాలను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సోమవారం, జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కూడా భేటీ అయ్యారు.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!