Jaishankar: రష్యా భారత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. యూఎస్, కెనడాలపై జైశంకర్ పరోక్ష దాడి..
- భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా రష్యా ఎప్పుడు ప్రవర్తించలేదు..
- ప్రధాని మోడీ రష్యా పర్యటన సమయంలో జైశంకర్ బిగ్ స్టేట్మెంట్..
- అమెరికా.. కెనడాలను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
Read Also: Cabbage Benefits: క్యాబేజీతో గుండె జబ్బులను చెక్ పెట్టండి!
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
మాస్కో, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవిగా చెప్పారు. ఈ రోజు రష్యా పరిస్థితి భిన్నంగా ఉందని, వెస్ట్రన్ దేశాలతో సంబంధాలు దిగజారిన సమయంలో, రష్యా ఆసియా వైపు చూస్తుందని చెప్పారు. రష్యాకి ఆసియాలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మన జాతీయ ప్రయోజనాలకు ఏది అవసరమవుతుందో ఆ పని చేస్తున్నామని అన్నారు. రష్యా సహజ వనరులకు కేంద్రంగా ఉందని చెప్పారు. ఇప్పుడున్న డెవలప్మెంట్ స్టేజ్లో భారత్ అతిపెద్ద వనరుల వినియోగదారుగా ఉందని అన్నారు. రష్యా ఆయిల్ గురించి అంతా మాట్లాడుతారు కానీ, చమురుతో పాటు ఎరువులు, ఖనిజాలు, బొగ్గుని కూడా భారత్ పొందుతుందని వెల్లడించారు. రెండు దేశాల సంబంధాల చరిత్ర చాలా పాజిటివ్గా ఉందని, ఇదే కొనసాగుతుందని చెప్పారు.
జైశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో అమెరికా, కెనడాలు భారత అంతర్గత విషయాల్లో వ్యాఖ్యలు చేయడం, ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతిస్తున్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూకి అండగా వ్యవహరిస్తోంది. చాలా సార్లు భారత్ని భయపెట్టేలా పన్నూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని అమెరికా ఖండించడం లేదు. ఈ రెండు దేశాలు కూడా వారి వ్యాఖ్యల్ని ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ’’గా అభివర్ణిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!