Jaishankar: రష్యా భారత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. యూఎస్, కెనడాలపై జైశంకర్ పరోక్ష దాడి..
- భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా రష్యా ఎప్పుడు ప్రవర్తించలేదు..
- ప్రధాని మోడీ రష్యా పర్యటన సమయంలో జైశంకర్ బిగ్ స్టేట్మెంట్..
- అమెరికా.. కెనడాలను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
Read Also: Cabbage Benefits: క్యాబేజీతో గుండె జబ్బులను చెక్ పెట్టండి!
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
మాస్కో, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవిగా చెప్పారు. ఈ రోజు రష్యా పరిస్థితి భిన్నంగా ఉందని, వెస్ట్రన్ దేశాలతో సంబంధాలు దిగజారిన సమయంలో, రష్యా ఆసియా వైపు చూస్తుందని చెప్పారు. రష్యాకి ఆసియాలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మన జాతీయ ప్రయోజనాలకు ఏది అవసరమవుతుందో ఆ పని చేస్తున్నామని అన్నారు. రష్యా సహజ వనరులకు కేంద్రంగా ఉందని చెప్పారు. ఇప్పుడున్న డెవలప్మెంట్ స్టేజ్లో భారత్ అతిపెద్ద వనరుల వినియోగదారుగా ఉందని అన్నారు. రష్యా ఆయిల్ గురించి అంతా మాట్లాడుతారు కానీ, చమురుతో పాటు ఎరువులు, ఖనిజాలు, బొగ్గుని కూడా భారత్ పొందుతుందని వెల్లడించారు. రెండు దేశాల సంబంధాల చరిత్ర చాలా పాజిటివ్గా ఉందని, ఇదే కొనసాగుతుందని చెప్పారు.
జైశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో అమెరికా, కెనడాలు భారత అంతర్గత విషయాల్లో వ్యాఖ్యలు చేయడం, ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతిస్తున్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూకి అండగా వ్యవహరిస్తోంది. చాలా సార్లు భారత్ని భయపెట్టేలా పన్నూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని అమెరికా ఖండించడం లేదు. ఈ రెండు దేశాలు కూడా వారి వ్యాఖ్యల్ని ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ’’గా అభివర్ణిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!